యాప్నగరం

భరణం కింద రూ.3 వేల కోట్ల చెల్లించాలని తీర్పు!

వివాహం తర్వాత 24 ఏళ్లు కలిసున్న ఓ జంట మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో న్యామయూర్తి దీనికి సమ్మతించారు.

TNN 12 May 2017, 12:15 pm
వివాహం తర్వాత 24 ఏళ్లు కలిసున్న ఓ జంట మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో న్యామయూర్తి దీనికి సమ్మతించారు. ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్ హడాన్ కేవ్ భరణం కింది సదరు భర్త 453 మిలియన్ డాలర్లు భార్యకు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ఆ బిలీనియర్ ఆస్తిలో 41.5 శాతం సంపద. మన కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 3 వేల కోట్లు. రష్యాకు చెందిన ఈ దంపతులు 1989లో తొలిసారిగా మాస్కోలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో నాలుగేళ్ల తర్వాత వివాహం చేసుకుని లండన్‌కు చేరి సుర్రే ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
Samayam Telugu judge orders city trader to pay ex wife 453m in biggest uk divorce award
భరణం కింద రూ.3 వేల కోట్ల చెల్లించాలని తీర్పు!


విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ హాడన్‌ 453 మిలియన్ డాలర్లు భరణం చెల్లించాలని భర్తను ఆదేశించారు. అంతే కాదు ఆ దంపతుల పేర్లను కూడా మీడియాకు వెల్లడించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. అయితే భర్త ఆస్తిలో తనకు సగభాగం ఇవ్వాలని ఆమె వాదించింది. ఎందుకంటే ఆ సంపాదనలో 24 ఏళ్లు నేనూ భాగస్వామిగా ఉన్నానని తెలిపింది. ఆమెను వివాహం చేసుకోడానికి ముందే తాను ఆస్తి సంపాదించానని ఇందులో ఆమె పాత్ర లేదని భర్త విచారణ సమయంలో కోర్టుకు విన్నవిస్తే న్యాయమూర్తి దీన్ని తోసిపుచ్చారు. కుటుంబ సంపదలో భార్యాభర్తలిద్దరికీ సమాన వాటా ఉంటుందని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.