యాప్నగరం

శిథిలాల నుంచి ప్రాణాలతో మూడేళ్ల పాప

కాన్పూర్‌లో ఆరు అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే.

TNN 2 Feb 2017, 4:22 pm
ఉత్తర ప్రదేశ్ లో కాన్పూర్‌లోని జాజ్మా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు భవనం కూలిన 12 గంటల తరువాత శిధిలాల నుంచి ఓ మూడేళ్ల పాప లక్ష్మిని ప్రాణాలతో బయటికి తీశారు సిబ్బంది. శిధిలాలను తొలగించి చూసేసరికి పాప నిద్రపోతోందని వారు చెప్పారు. వెంటనే ఆ పాపని లాలా లజపతి రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పాపని చూశాక శిధిలాల కింద నుంచి ఇంకా అనేక మంది ప్రాణాలతో బయటపడతారమే ఆశ ఉందని వారు చెప్పారు.
Samayam Telugu kanpur building collapse 3 yr old rescued from debris after 15 hours
శిథిలాల నుంచి ప్రాణాలతో మూడేళ్ల పాప


అత్యాధునిక పరికరాలతో శిథిలాలను తొలగించడం, ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో కనుగొంటున్నామని వారు చెప్పారు. విక్టిమ్ లొకేటింగ్ కెమెరా (బాధితులను గుర్తించే కెమెరా) ద్వారా బాధితులను ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడ శిథిలాలను తొలగిస్తున్నట్టు చెప్పారు.

విక్టిమ్ లొకేటింగ్ కెమెరా ద్వారా శిధిలాల కింద 30 నుంచి 50 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. వారందరినీ బయటికి తీయడానికి ఇంకా 48 నుంచి 72 గంటలు పట్టే అవకాశం ఉందన్నారు. భవనం మూడో అంతస్థులో భారీగా బాధితులు ఉన్నట్టు గుర్తించామని, అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.