‘మాకు అధికారాన్ని ఇస్తే.. విదేశాల్లో మూలుగుతున్న భారతీయ నల్లధనికుల బ్లాక్ మనీని ఇండియాకు తెప్పిస్తాం, ఆ మొత్తాన్నంతా ఒక్కో వ్యక్తి అకౌంట్లలోకి వేస్తాం. అలా చేస్తే కనీసం ఒక్కో వ్యక్తికి పదిహేను లక్షల రూపాయలు దక్కుతాయి...’ అని గత సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తెప్పిస్తామని స్వయంగా నరేంద్రమోడీ నాడు అనేక ఎన్నికల సభల్లో ప్రజలకు హామీని ఇచ్చారు. ఆ విషయంలో మోడీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కేరళ రైతు మోడీకి ఒక లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. తన వాటా మొత్తాన్ని తన అకౌంట్లోకి వేయాలని కోరుతూ కే చాతూ(68) రైతు ప్రధానికి లేఖ రాశారు. అంతా కాకపోయినా ప్రస్తుతానికి ఒక ఐదు లక్షల రూపాయలను జమ చేయాలని, తన ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను మోడీకి పంపించాడు ఈ వ్యక్తి. వరసగా పంట నష్టాలతో తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అని, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాను అని.. పంట నష్టపరిహారం కూడా అందడం లేదని, ఇలాంటి నేపథ్యంలో విదేశాల్లోని నల్లధనంలోని తన వాటాలో ఒక ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని తక్షణం తనకు అంద జేయాలని ఈ రైతు కోరాడు. పీఎంవో అడ్రస్ కు చాతూ తన లేఖను పంపించాడు.
రాజకీయ పార్టీ ఎన్నికల హామీని ప్రస్తావిస్తూ ఒక రైతు ఈ విధంగా లేఖ రాయడం ఆసక్తిదాయకమైన అంశమే. మరి ఈ లేఖకు ప్రధాని కార్యాలయం, మోడీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ రీతిన స్పందించడం చాతూకు కొత్తేమీ కాదు. చాతూకి గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసిన అనుభవం ఉంది. హామీలు, బూటకపు మాటల విషయంలో కన్జూమర్ ఫోరమ్ కు ఎక్కిన నేపథ్యం కూడా ఉంది ఇతడికి.
వెనుకటికి ఒక సబ్బుల కంపెనీపై చాతూ వినియోగదారుల ఫోరంలో ఒక కేసు వేశాడు. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టీ అడ్వర్టైజ్ మెంట్ ను చూసి తను కొన్నాళ్లపాటు ఒక సబ్బును వాడాను అని, ఆ సబ్బును వాడితే తెల్లగా మారతారని యాడ్ లో చెప్పారని, తను మాత్రం తెల్లగా కాలేదని ఒక కేసు వేశాడితను. కాబట్టి తనకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. కేసును విచారించిన ఫోరమ్ చాతూ వాదనతో ఏకీభవించింది, సోప్ కంపెనీ చేత ముప్పై వేల రూపాయల నష్టపరిహారాన్ని కట్టించింది. క్షమాపణ కూడా చెప్పించింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. తన వాటా మొత్తాన్ని తన అకౌంట్లోకి వేయాలని కోరుతూ కే చాతూ(68) రైతు ప్రధానికి లేఖ రాశారు. అంతా కాకపోయినా ప్రస్తుతానికి ఒక ఐదు లక్షల రూపాయలను జమ చేయాలని, తన ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను మోడీకి పంపించాడు ఈ వ్యక్తి. వరసగా పంట నష్టాలతో తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అని, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాను అని.. పంట నష్టపరిహారం కూడా అందడం లేదని, ఇలాంటి నేపథ్యంలో విదేశాల్లోని నల్లధనంలోని తన వాటాలో ఒక ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని తక్షణం తనకు అంద జేయాలని ఈ రైతు కోరాడు. పీఎంవో అడ్రస్ కు చాతూ తన లేఖను పంపించాడు.
రాజకీయ పార్టీ ఎన్నికల హామీని ప్రస్తావిస్తూ ఒక రైతు ఈ విధంగా లేఖ రాయడం ఆసక్తిదాయకమైన అంశమే. మరి ఈ లేఖకు ప్రధాని కార్యాలయం, మోడీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ రీతిన స్పందించడం చాతూకు కొత్తేమీ కాదు. చాతూకి గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసిన అనుభవం ఉంది. హామీలు, బూటకపు మాటల విషయంలో కన్జూమర్ ఫోరమ్ కు ఎక్కిన నేపథ్యం కూడా ఉంది ఇతడికి.
వెనుకటికి ఒక సబ్బుల కంపెనీపై చాతూ వినియోగదారుల ఫోరంలో ఒక కేసు వేశాడు. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టీ అడ్వర్టైజ్ మెంట్ ను చూసి తను కొన్నాళ్లపాటు ఒక సబ్బును వాడాను అని, ఆ సబ్బును వాడితే తెల్లగా మారతారని యాడ్ లో చెప్పారని, తను మాత్రం తెల్లగా కాలేదని ఒక కేసు వేశాడితను. కాబట్టి తనకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. కేసును విచారించిన ఫోరమ్ చాతూ వాదనతో ఏకీభవించింది, సోప్ కంపెనీ చేత ముప్పై వేల రూపాయల నష్టపరిహారాన్ని కట్టించింది. క్షమాపణ కూడా చెప్పించింది.