యాప్నగరం

కేరళ: హిందూ ఆలయంలో ముస్లింల ఈద్ ప్రార్థనలు

వరదలతో కేరళ మొత్తం చిన్నాభిన్నమయ్యింది. ఊళ్లకు ఊళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎటు చూసినా ప్రకృతి విలయతాండవానికి.. ఇళ్లన్నీ కుప్ప కూలిపోయి నామరూపాలు లేకుండాపోయిన గ్రామాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయంలోనూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఓ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Samayam Telugu 23 Aug 2018, 8:14 pm
వరదలతో కేరళ మొత్తం చిన్నాభిన్నమయ్యింది. ఊళ్లకు ఊళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎటు చూసినా ప్రకృతి విలయతాండవానికి.. ఇళ్లన్నీ కుప్ప కూలిపోయి నామరూపాలు లేకుండాపోయిన గ్రామాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయంలోనూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఓ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu Kerala


త్రిస్సూర్ జిల్లాలోని కొచ్చుకడవు గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితి. ఇలాంటి సమయంలోనే బక్రీద్ పండుగ కూడా వచ్చింది. ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేద్దామంటే మసీదు వరద నీటిలో ఉంది. ఏం చేయాలో అర్థంకాని స్థితి పాపం ఆ ముస్లిం సోదరులది. దగ్గరలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకుందామంటే అంతా బురదమయం. అప్పుడే అండగా మేమున్నామంటూ ముందుకొచ్చారు స్థానికులు. దగ్గరలోని పురప్పుల్లికవు రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ముస్లింలు ఆ ఆలయంలోనే తమ ఈద్ ప్రార్థనల్ని పూర్తి చేశారు. ఈ అద్భుత సన్నివేశాన్ని ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.