యాప్నగరం

వీడియో: యోగాతో అబ్బురపరిచిన అమ్మాయి!

మైసూరుకు చెందిన ఒక అమ్మాయి యోగాలో అతి కష్టమైన ఆసనాలను అలవోకగా వేసి రికార్డు సృష్టించింది..

TNN 12 Jun 2017, 1:44 pm
మైసూరుకు చెందిన ఒక అమ్మాయి యోగాలో అతి కష్టమైన ఆసనాలను అలవోకగా వేసి రికార్డు సృష్టించింది. ‘నిరాలంబ పూర్ణ చక్రాసన’గా పేర్కొనే ఈ క్లిష్టమైన ఆసనాన్ని నిమిషంలో 15 సార్లు వేసి, ఆహుతులను అబ్బుర పరిచింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరం ఆదివారం (జూన్ 11) ఈ ప్రత్యేక ప్రదర్శనకు వేదికైంది. ఈ నగరానికి చెందిన ‘కుశి’ అనే అమ్మాయి యోగాసనాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది. ఆమెకు ‘కళాశ్రీ’ అవార్డు కూడా వచ్చింది. తాజాగా ఈమె నిరాలంబ పూర్ణ చక్రాసనపై ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసింది.
Samayam Telugu kushi from mysore creates record by doing tough yogasana
వీడియో: యోగాతో అబ్బురపరిచిన అమ్మాయి!


అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (జూన్ 21) సన్నాహకంగా ఇప్పటికే దేశంలోని అన్ని నగరాల్లో యోగాపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ.. మూడు తరాలకు చెందిన వారితో యోగాసనాలు వేస్తున్న ఫోటోలను పంపించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ఇందులో అత్యుత్తమ ఫోటోలను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.