యాప్నగరం

14 మందితో 14 మంది పిల్లల్ని కన్నదంటూ..

అమెరికాకు చెందిన ఓ మహిళ గతేడాది బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆమె తన భర్త, కొడుకుతో దిగిన ఫొటో ఓ వార్తా పత్రికలో దర్శనమిచ్చింది. ఇంతకూ ఆ వార్తెంటో తెలుసా?

TNN 2 Dec 2016, 3:16 pm
అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన కరేనా బెన్నెట్ అనే మహిళ గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ గారాల బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారిద్దరూ ఆ చిన్నారితో కలిసి ఫొటో దిగారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఫొటో ఒక స్థానిక న్యూస్ పేపర్లో కనిపించింది. ఆ వార్తలో శీర్షిక చూసి చూసి ఆమె ఒక్కసారిగా షాకైంది. ‘డెట్రాయిట్ మహిళ 14వ బిడ్డకు జన్మనిచ్చింది. ఒక్కో బిడ్డకు ఒక్కో తండ్రి..’ అని హెడ్డింగ్ పెట్టి ఓ కథనాన్ని వండి వార్చేసింది. అది అబద్ధం అయినప్పటికీ జనం దృష్టిని మాత్రం బాగా ఆకర్షించింది.
Samayam Telugu lady has 14 kids by 14 men false story went viral
14 మందితో 14 మంది పిల్లల్ని కన్నదంటూ..


ఇక అది మొదలు ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. జనాలు ఆమెను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరూ తిట్టడమే కాకుండా.. ఫేస్‌బుక్ ద్వారా చండాలమైన మేసేజ్‌లను పంపేవారు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 వేల మంది ఆమెకు కామెంట్లు పెట్టారు. ఇది ఆమెకు తీరని వేదనను మిగిల్చింది. ఆన్‌లైన్‌లో ఫొటోలు ఉంచే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తనలా కావద్దని బెన్నెట్ ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూలో చెప్పింది. మీ ప్రొఫైళ్లను ప్రయివేట్‌గా ఉంచుకోండి లేదంటే ఫొటోలపై వాటర్‌మార్క్ వేసుకోండి. లేదంటే మీరు కూడా నాలాగే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.