యాప్నగరం

ఖరీదైన పెళ్లి: పులి మీద ఊరేగిన వరుడు

పాకిస్థాన్ కూడా భారత్ బాటలో నడుస్తోంది. ఈ మధ్యనే గనుల వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు పెళ్లిన కనీవినీ ఎరుగని రీతిలో చేశారు.

Samayam Telugu 26 Mar 2017, 3:07 pm
పాకిస్థాన్ కూడా భారత్ బాటలో నడుస్తోంది. ఈ మధ్యనే గనుల వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు పెళ్లిన కనీవినీ ఎరుగని రీతిలో చేశారు. ఆకాశమంత పందిరి వేసి.. దేశంలోని ప్రముఖులను ఆహ్వానించి ఔరా అనిపించారు. పెద్ద నోట్లు రద్దయిన సమయంలో జరిగిన ఆయన కూతురు పెళ్లికి రూ.500కోట్లకు తగ్గకుండా చేశారు.
Samayam Telugu lavish wedding in pakistan grooms precession in lion
ఖరీదైన పెళ్లి: పులి మీద ఊరేగిన వరుడు


ఆ తర్వాత కేరళలోనూ ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి ఇంతే స్థాయి ఘనంగా జరిపి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు పాకిస్థాన్ లోని ముల్తాన్ కు చెందిన ఓ కోటీశ్వరుడు తన కొడుకు షేక్ మహ్మాద్ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. ఒంటిమీద బంగారు ఆభరణాలతో అలకరించి వార్తల్లో నిలిచేట్లు చేశాడు. అంతేకాదు కొడుకు పెళ్లి కొడుకు కోరిక మేరకు పెళ్లి సమయంలో పులిపై ఎక్కించి వరుణ్ణి ఊరేగించి అందరిని ఆశ్చర్యపరిచాడు. పులిపై స్వారా? అని ఆశ్చర్య పోకండి..అవును పులే..కాకపోతే పులిని ఓ పంజరంలో బంధించి..దాన్ని ఓ ట్రాలిలో ఎక్కించారు. ఆ ట్రాలిని అలంకరించి పెళ్లికొడుకును దానిపై కూర్చోబెట్టి ధూంధాంగా ఊరేగించారు.


బరాత్ లో కరెన్సీ నోట్లను వెదజల్లి తన పలుకుబడిని నిరూపించుకుడు వరుడి తండ్రి. అంతేకాదు పెళ్లి కూతురు కుటుంబం నుంచి కట్నంగా రూ.5కోట్లు స్వీకరించారు. హోండా కారు, మోటార్ సైకిళ్లు, ఇతర పెట్టుబడులు బాగానే అందించారు.

ధూంధాంగా తనయుడి పెళ్లి చేసిన కోటీశ్వరుడిపై పాక్ ఆదాయపన్ను శాఖ అధికారులు నిఘా పెట్టారు. పెళ్లి ఖర్చులు, ఆదాయపన్ను వివరాల లెక్క చెప్పాలని నోటీసులు జారీ చేశారు.

షేక్ మహ్మాద్ పెళ్లి పాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.