విధి నిర్వహణలో ఉన్న రైల్వే హెడ్ క్లర్క్ పార్శిల్ కార్యాలయంలో ఓ యువతితో సాగించిన సరససల్లాపాల సీసీటీవీ ఫుటేజ్ హక్కుల కార్యకర్త చేతికి అందడంతో కలకలం రేపుతోంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్లోని రైల్వే పార్శిల్ కార్యాలయాల్లో అక్రమాలను బయటపెట్టడానికి సమాచార హక్కు చట్టం కార్యకర్త అజయ్ బోస్ సీసీటీవీ పుటేజ్ను సేకరించారు. టెర్మినల్ పార్శిల్ విభాగంలో రాత్రిపూట విధులు నిర్వహించే రైల్వే హెడ్ క్లర్కు ఒక యువతితో సన్నిహితంగా మెలగడం ఈ సీసీటీవీ పుటేజ్లో రికార్డయింది. 90 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో క్లర్క్ అజయ్ ఆ యువతిపై చేతులు వేయడం, కలిసి భోజనం చేయడం, పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడం దాకా అన్నీ రికార్డయ్యాయి.
సదరు యువతి ఒక బార్లోని ఆర్కెస్ట్రా విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతిని తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ విషయం వెలుగు చూడడంతో సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ రవీంద్ర గోయల్ స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే సదరు యువతితో తనకు ముందే పరిచయం ఉందని, ఢిల్లీ వెళ్లే విమానం తప్పిపోవడంతో రైల్లో ప్రయాణించేందుకు వచ్చిందని, సురక్షితంగా ఉంటుందని తన కార్యాలయంలో కూర్చోబెట్టానని సదరు క్లర్క్ చెప్పడం గమనార్హం.
సదరు యువతి ఒక బార్లోని ఆర్కెస్ట్రా విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతిని తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ విషయం వెలుగు చూడడంతో సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ రవీంద్ర గోయల్ స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే సదరు యువతితో తనకు ముందే పరిచయం ఉందని, ఢిల్లీ వెళ్లే విమానం తప్పిపోవడంతో రైల్లో ప్రయాణించేందుకు వచ్చిందని, సురక్షితంగా ఉంటుందని తన కార్యాలయంలో కూర్చోబెట్టానని సదరు క్లర్క్ చెప్పడం గమనార్హం.