యాప్నగరం

కోర్టు వారి కాపురాన్ని నిలబెట్టింది

చిన్నచిన్న గొడవలతో విడిపోవాలనుకున్న ఓ జంటను కోర్టు మళ్లీ ఒక్కటి చేసింది. జీవితాంతం వారు కలిసి ఉండేలా మంచి మాటలు చెప్పింది.

TNN 2 Jul 2016, 1:02 pm
చిన్నచిన్న గొడవలతో విడిపోవాలనుకున్న ఓ జంటను కోర్టు మళ్లీ ఒక్కటి చేసింది. జీవితాంతం వారు కలిసి ఉండేలా మంచి మాటలు చెప్పింది.
Samayam Telugu madhyapradesh court incident
కోర్టు వారి కాపురాన్ని నిలబెట్టింది

మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన రమేశ్‌, రాశికి (కోర్టు విజ్ఞప్తి మేరకు పేర్లు మార్చాం) కొన్నేళ్ల కిందే వివాహమైంది. ఆ దంపతుల మధ్య వివాహమైన కొద్ది రోజులకే గొడవలు ప్రారంభమయ్యాయి. రాశి ఆరునెలల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా గొడవలు మాత్రం అలాగే కొనసాగాయి. దీంతో రాశి పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు విడాకులు కావాలని, తనకు, తన బిడ్డ పోషణకు కావాల్సిన డబ్బు భర్త నుంచి ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ జిల్లా న్యాయమూర్తి గంగాచరణ్ దూబే డ్రైవర్ అయిన రమేశ్ కు భార్యభర్తల సంబంధం గుర్తు చేశాడు. భార్యమీద భర్త తప్పక ప్రేమ చూపించాలని అన్నాడు. ప్రతి రోజు సాయంత్రం 'హాయ్ డార్లింగ్.. ఎలా ఉన్నావు? అని ప్రేమగా పలకరించాలని ఆయన స్వయంగా చెప్పారు. భర్త ఎప్పుడూ భార్యతోనే ఉండాలని, పుట్టింటికి వెళితే వెళ్లి ప్రేమ చూపించి తిరిగి తన వద్దకు తెచ్చుకోగలగాలని సూచించారు. వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ అన్యోన్యంగా మెలగాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.