యాప్నగరం

ఫ్యాషన్ షోలో సీఎం సతీమణి!

ఓ సీఎం భార్య న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడవనున్నారు. ముఖ్యమంత్రి భార్య ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడానికి కారణం ఏంటో తెలుసా?

TNN 8 Sep 2016, 11:19 am
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ నేడు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద తళుక్కున మెరవనున్నారు. ఓ మంచి కారణంతోనే ఆమె ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంటున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ధరించనున్న దుస్తులు కూడా రైతులు, కూలీల బిడ్డలు రూపొందించినవే కావడం విశేషం. పుణేకు చెందిన చాసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ తరఫును ఆమె ఈ షోలో పాల్గొంటున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడం కోసమే తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని అమృత ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. బాలికలు చదువుకోవడం వల్ల కుటుంబం కూడా విద్యను అభ్యసిస్తుందని, ఫలితంగా దేశంలో అక్షరాస్యత మెరుగుపడటంతో పాటు దేశం ముందుకెళ్తుందని ఆమె తెలిపారు. యాసిడ్ దాడి బాధితురాలు రేష్మా ఖురేషి, బాలీవుడ్ నటి సన్నీలియోనీలు కూడా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంటున్నారు.
Samayam Telugu maharashtra cms wife amrutha fadnavis is participating in ny fashion week
ఫ్యాషన్ షోలో సీఎం సతీమణి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.