యాప్నగరం

లారీతో తొక్కించి తల్లిని హత్య చేసిన కొడుకు

సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు.

TNN 19 Dec 2017, 10:05 am
సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన బెంగళూరు శివారు విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంపమ్మతిమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై కేసు నమోదుచేసిన విశ్వనాథపుర పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu man driving lorry runs over mother kills her
లారీతో తొక్కించి తల్లిని హత్య చేసిన కొడుకు


యశ్వంతపురలో నివాసముంటున్న జయశ్రీ(45) వితంతువు. ఆమె భర్త రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం తన ఇద్దరి పిల్లలను సవతి తల్లి వద్ద విడిచిపెట్టిన జయశ్రీ.. ఇంట్లో నుంచి వచ్చేసి ఒంటరిగా బతుకుతోంది. ఆమెకు విపరీతమైన దైవభక్తి. తనపై దేవుడు పూనతాడని కుటుంబంతో కలిసి తాను జీవించలేనని వేరుగా వచ్చేసింది. అయితే సోమవారం తన భర్తకు చెందిన భూమి వద్దకు వచ్చిన జయశ్రీ.. ఇక్కడ గుడి కట్టిస్తున్నాని పూజలు చేయడం మొదలుపెట్టింది. దీంతో భర్త రెండో భార్య, పిల్లలు ఆమెతో గొడవకు దిగారు. అయినప్పటికీ ఆమె అక్కడి నుంచి వెళ్లకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గరైన కొడుకు అరుణ్(22) లారీతో ఆమెను తొక్కించి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి లారీతో పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఇది పూజ కోసం జరిగిన గొడవలా లేదని, ఆస్తి తగదాలా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయశ్రీ భర్తకు కొంత భూమి ఉందని.. దీన్ని సొంతం చేసుకునే విషయంలో భర్త రెండో భర్యతో జయశ్రీకి గొడవలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో అరుణ్ తన పెంపుడు తల్లికే మద్దతిచ్చాడని.. అడ్డువచ్చిన కన్న తల్లి జయశ్రీని చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.