యాప్నగరం

తండ్రిని చంపి..పొరుగిల్లు తగులబెట్టిన కొడుకు

తనను ఇంట్లో నుంచి గెంటేశాడన్న కోపంతో తండ్రిని 36సార్లు పొడిచి చంపాడో కసాయి తనయుడు.

TNN 9 Jan 2017, 8:32 am
తనను ఇంట్లో నుంచి గెంటేశాడన్న కోపంతో తండ్రిని 36సార్లు పొడిచి చంపాడో కసాయి తనయుడు. అంతటితో ఆగకుండా అదే ఉన్మాదంలో మరో మహిళపై దాడి చేశాడు..పక్కనే ఫ్లాటులోకి చొరబడి తగులబెట్టాడు.
Samayam Telugu man kills dad blows up neighbours flat
తండ్రిని చంపి..పొరుగిల్లు తగులబెట్టిన కొడుకు


ఈ ఉన్మాద సంఘటన ఆదివాం మధ్యాహ్నాం ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే నేవీలో ఉద్యోగం చేస్తూ తన ప్రవర్తన వల్ల ఆ జాబ్ కూడా పోగొట్టుకున్న రాహుల్ మట్ట (38) ఉన్మాదంతో చేసిన పనుల వల్ల ఇది వరకే రెండు సార్లు జైలు కూడా వెళ్లి వచ్చాడు. కొడుకు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తండ్రి రవీంధ్ర మట్ట (60) 15 రోజుల క్రితం తన ఇంట్లో నుంచి బయటకు పంపించాడు.

దీంతో ఆదివారం మధ్యాహ్నాం తండ్రి నివాసం ఉంటున్న ఇంటికి వచ్చిన రాహుల్...వెంట తెచ్చుకున్న కత్తితో 36 సార్లు పొడిచి చంపాడు. అదే ఉన్మాద మైకంలో ఉన్న రాహుల్ పొరుగు ఫ్లాటులోకి చొరబడి ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. అక్కడే మరో వ్యక్తిని బంధించి ఆ ఫ్లాట్ కు లోపలి నుంచి గడియ పెట్టాడు.

చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చారన్న సంగతి తెలుసుకున్న రాహుల్...ఆ ఫ్లాటులోని కిచెన్ లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇల్లు తగులబెట్టాడు. ఈ ఘటనలో ఫ్లాటులో ఉన్న వారిని రక్షించే క్రమంలో దాదాపు తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు.

దాదాపు గంటపాటు సాగిన ఈ ‘డ్రామా’కు కారణమైన రాహుల్ ను ఎట్టకేలకు అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.