యాప్నగరం

అనుమాన సహాజీవనం: పార్ట్‌నర్ హత్య

ఎనిమిదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ముక్కలుముక్కలు నరికి చంపాడో వ్యక్తి.

Samayam Telugu 9 Dec 2016, 10:14 am
ఎనిమిదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ముక్కలుముక్కలు నరికి చంపాడో వ్యక్తి. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
Samayam Telugu man kills woman and cut into pieces
అనుమాన సహాజీవనం: పార్ట్‌నర్ హత్య


ఢిల్లీకి చెందిన బలరామ్ తమిళనాడుకు చెందిన అనార్కలి అనే మహిళతో గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె ఇటీవల వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించిన బలరామ్..డిసెంబర్ 1, 2 తేదీల్లో ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో ఉన్న బలరామ్ సుత్తితో అనార్కలి తలపై మోది చంపేశాడు.

అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా మాయం చేసేందుకు రెండు భాగాలుగా నరికాడు. వాటిని సంచుల్లో వేసి మురికి కాల్వలో పడేశాడు.

రెండు ప్రాంతాల్లో రెండు ముక్కలుగా దొరికిన డెడ్ బాడీని పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పోస్టర్లు గోడలపై అంటించడంతో పాటు డోర్ టు డోర్ వెళ్లి పోలీసులను నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి..బలరామ్ ను గురువారం అరెస్టు చేశారు.


A 48 year old man was arrested for allegedly killed his live in partner being unfaithful to him. The incident happened in south east Delhi where the dead body found in two parts and dumping them in separate places.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.