యాప్నగరం

భార్యను రైల్‌లో నుంచి తోసేశాడు....

కదులుతున్న రైలు నుంచి తన భార్యను ఓ వ్యక్తి తోసేసి ఆమె చావుకు కారణమయ్యాడు.

Samayam Telugu 17 May 2017, 3:37 pm
కదులుతున్న రైలు నుంచి తన భార్యను ఓ వ్యక్తి తోసేసి ఆమె చావుకు కారణమయ్యాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నుంచి ఓ వ్యక్తి తన భార్యను తోసేశాడు. ఈ ఘటనలో ఆయన భార్య మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
Samayam Telugu man throws wife from running train at prakasam district in ap
భార్యను రైల్‌లో నుంచి తోసేశాడు....


విషయం తెలుసుకున్న విజయవాడ రైల్వే పోలీసులు రంగంలోకి దిగి భర్తను అరెస్ట్ చేశారు. రిజర్వేషన్‌ చార్టు ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మృతురాలు కల్పనగా, ఆమె భర్త సంతోష్‌కుమార్‌ గా పోలీసులు గుర్తించారు.

భార్యపై అనుమానంతోనే ప్రణాళిక ప్రకారం సంతోష్ కల్పనను తోసేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.