యాప్నగరం

అవకాశం చేజార్చిన నీట్.. విద్యార్థిని ఆత్మహత్య

మెడికల్ కళాశాలల్లో నీట్ ఆధారంగా సీట్ల కేటాయింపు తప్పనిసరి చేయడంతో.. స్టేట్ బోర్డ్ పరీక్షలో ప్రతిభ కనబరిచినా ప్రవేశం దక్కక పోవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని అరియాపూర్‌కు చెందిన అనిత..

TNN 11 Sep 2017, 8:44 pm
మెడికల్ కళాశాలల్లో నీట్ ఆధారంగా సీట్ల కేటాయింపు తప్పనిసరి చేయడంతో.. స్టేట్ బోర్డ్ పరీక్షలో ప్రతిభ కనబరిచినా ప్రవేశం దక్కక పోవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన అనిత (17 ఏళ్లు) ఈ ఏడాదికి నీట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను నిలిపేయాలంటూ.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ నిర్ణయం వల్ల తన లాంటి చాలా మంది గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వాదించింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ నిరాశ ఎదురవడంతో చివరికి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu medical aspirant commits suicide after failing to get admission
అవకాశం చేజార్చిన నీట్.. విద్యార్థిని ఆత్మహత్య


గతంలో మాదిరిగానే తమ రాష్ట్రంలో ప్లస్ టూ ఆధారంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే ఉంటే.. కనుమూర్ గ్రామం నుంచి మొట్టమొదటి డాక్టర్‌గా అనిత గుర్తింపు పొంది ఉండేదని ఆమె సోదరుడు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అనిత.. తల్లి మరణించడంతో అనేక కష్టాలకోర్చి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. బోర్డు మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తే.. ఆమెకు సులువుగా మెడికల్ సీటు దక్కేది. డాక్టర్ కావాలన్న ఆమె ఆశలపై నీట్‌ నీళ్లు చల్లడంతో కుంగిపోయింది. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించినా.. ఆమెకు నిరాశే దక్కింది. ఎన్నో కష్టాలకోర్చి చదివినా కన్నీరే మిగలడంతో అనిత ఉరేసుకొని మరణించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.