యాప్నగరం

పెట్రో పంచ్: పీఎం నిధికి తెలంగాణ వ్యక్తి 9 పైసలు దానం

‘పెట్రోల్ ధర ఒక పైసా తగ్గింది. తొమ్మిది లీటర్లకు 9 పైసలు మిగిలాయి. వీటిని బ్యాంకులో పెట్టుకోవడం చాలా ప్రమాదకరం.. ఏం చేస్తే బాగుంటుందని ఓ వ్యక్తి తన స్నేహితుడిని అడిగితే.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపు’’ అని సలహా ఇస్తాడు.

Samayam Telugu 5 Jun 2018, 8:05 pm
‘పెట్రోల్ ధర ఒక పైసా తగ్గింది. తొమ్మిది లీటర్లకు 9 పైసలు మిగిలాయి. వీటిని బ్యాంకులో పెట్టుకోవడం చాలా ప్రమాదకరం.. ఏం చేస్తే బాగుంటుందని ఓ వ్యక్తి తన స్నేహితుడిని అడిగితే.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపు’’ అని సలహా ఇస్తాడు. ఈ జోక్ ఇటీవల వాట్సాప్‌లో వైరల్‌ అయ్యింది. అయితే, ఈ జోకును నిజం చేసి చూపించాడు.. చంద్రయ్య అనే వ్యక్తి.
Samayam Telugu asdaaaa


ఇటీవల తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వి.చంద్రయ్య అనే వ్యక్తి 9 పైసల చెక్‌ను జిల్లా కలెక్టర్‌కు అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్ ధర 9 పైసలు తగ్గింది. దీనివల్ల ఆదా చేసిన 9 పైసలను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు దానమిచ్చాను. నేను దానం చేసిన మొత్తం ఏదైనా మంచి పనికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’’ అని తెలిపాడు.
కర్ణాటకలో ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రజలు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ‘పైసలు’ చొప్పున ధరలు తగ్గిస్తోంది. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన చంద్రయ్య.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు దానం చేసి అందరి దృష్టి ఆకట్టుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.