యాప్నగరం

జై ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి

జై తప్పిపోయి మూడున్నర నెలలు గడుస్తోంది... అది ఎక్కడుందో... ఏమైందో తెలియదు.

TNN 30 Jul 2016, 10:46 am
జై తప్పిపోయి మూడున్నర నెలలు గడుస్తోంది... అది ఎక్కడుందో... ఏమైందో తెలియదు. జై ఆచూకీ కోసం స్వచ్ఛంద సంస్థలు, అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు. ఇంతకీ జై ఎవరో తెలుసా? పెద్ద పులి. మహారాష్ట్రాలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఉమ్ రెడ్ కర్హండా అభయారణ్యం నుంచి కనిపించకుండా పోయింది. సరిగ్గా ఏప్రిల్ 18 నుంచి కనిపించకుండా పోయింది. దాని అడుగు జాడలు, ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. అందుకు రూ.50,000 రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50,000 పారితోషికంగా ప్రకటించింది. పెద్ద పులి ఆచూకీ చెబితే మొత్తం లక్ష రూపాయలు రివార్డు అందుతుంది. శుక్రవారం ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా జై దొరుకుతుందనే ఆశని వ్యక్తం చేశారు.
Samayam Telugu missing mystery of tiger jai rs 50000 reward to trace
జై ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.