యాప్నగరం

ఇద్దరు కుమారులతో రైలు కింద పడి తల్లి ఆత్మహత్య

ఓ వివాహిత తన ఇద్దరి కుమారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

TNN 22 Jan 2017, 4:41 pm
ఓ వివాహిత తన ఇద్దరు కుమారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌కు కిలోమీటరున్నర దూరంలో మణికొండకు చెందిన 32 ఏళ్ల మహిళ గౌరమ్మ ఆమె కుమారులు నాగరాజు (7), సాయి తేజ (6) మృత దేహాల‌ను పట్టాలపై గుర్తించినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు.
Samayam Telugu mother commit suicied her two kids on rail track in malkajgiri
ఇద్దరు కుమారులతో రైలు కింద పడి తల్లి ఆత్మహత్య


ఇద్దరు పిల్లలు బండ్లగూడలోని విశ్వభారతి హైస్కూల్‌లో చదువుతున్నట్లు గుర్తింపు కార్డుల ఆధారంగా కనుగొన్నారు. శనివారం ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి మల్కాజ్‌గిరి వైపు వస్తున్న లోకోమోటివ్ పైలట్ మృత దేహాల‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రైలు పట్టాల పక్కన పడి ఉన్న మృత దేహాల‌ ముఖాలు గుర్తించలేనంతంగా ఛిద్రమైనట్లు పోలీసులు తెలియజేశారు.

చనిపోయిన పిల్లలు స్కూల్ యూనిఫామ్‌లో ఉండటంతో ఉదయమే ఈ సంఘటన జరిగి ఉంటుందని జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు పేర్కొన్నారు. తాగుబోతు భర్త బండ్లయ్య వేధింపులు భరించలేకే ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని ఆయన తెలిపారు. భర్త తాగుడికి బానిస కావడంతో గౌరమ్మ గ్రీన్ స్పేస్ సిగ్మా అపార్ట్‌మెంట్‌లో పని మనిషిగా చేరి పిల్లలను పోషించుకునేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.