యాప్నగరం

కూతురి ప్రేమ నచ్చక... చంపేసింది

దేశంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి.

TNN 7 Jun 2017, 11:15 am
దేశంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రేమ అన్న పదమే కొందరిలో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఫలితంగా ఎంతో భవిష్యత్తున్న యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ తల్లి కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక.. తన కడుపున పుట్టిన బిడ్డనే చంపేసింది. కోలారు జిల్లా చిన్నాపుర గ్రామంలో వెంకటమ్మ, తన కూతురుతో కలిసి నివసిస్తోంది. భర్త మరణించడంతో తానే కష్టపడి కూతురిని చదివిస్తోంది. కూతురు రాజేశ్వరి ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె గ్రామానికి చెందిన ఓ యువకుడినే ప్రేమించింది. ఆ ప్రేమ తల్లికి నచ్చలేదు. ప్రేమలు మనకు సరిపడవు... దూరంగా ఉండమని హెచ్చరించింది. నలుగురిలో పరువు పోతుందని చెప్పింది. అయినా రాజేశ్వరి తీరు మారలేదు. పైగా ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైంది కూడా. దీంతో వెంకటమ్మకు చాలా కోపం వచ్చింది.
Samayam Telugu mother kills daughter over love affair
కూతురి ప్రేమ నచ్చక... చంపేసింది


సోమవారం రాత్రి కూతురితో తీవ్రంగా గొడవపడింది. కోపంలో దుడ్డుకర్రతో తలమీద మోదింది. ఒక్క దెబ్బకే రాజేశ్వరి కుప్పకూలిపోయి... ప్రాణాలు విడిచింది. ఆ రాత్రంతా ఏమీ తెలియనట్టు నిద్రపోయింది వెంకటమ్మ. ఉదయం లేచి తన కూతురు చనిపోయిందంటూ కేకలు వేసింది. వెంటనే అంత్యక్రియలు చేసేందుకు సిద్దపడింది. గ్రామస్థులకు ఆమె వ్యవహారమంతా అనుమానాస్పదంగా అనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించి, తల్లిని అరెస్టు చేశారు. విచారణలో జరిగిందంతా చెప్పింది వెంకటమ్మ. తానే హత్య చేసినట్టు అంగీకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.