యాప్నగరం

రన్ వే పైనే పేలిన విమానం టైరు

గురువారం సాయంత్రం ముంబై ఎయిర్ పోర్టులో ఓ విమానం టైరు పేలిపోయింది.

TNN 4 Mar 2016, 2:33 pm
గురువారం సాయంత్రం ముంబై ఎయిర్ పోర్టులో ఓ విమానం టైరు పేలిపోయింది. దీంతో కాసేపు ఏం జరిగిందో తెలియక కలకలం రేగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం.... జెట్ ఎయిర్ వేస్ కి చెందిన ఓ విమానం ఢిల్లీ నుంచి రాత్రి 9.50 నిమిషాలకు ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆ సమయంలో పెద్ద శబ్దంతో పాటూ... విమానం కింద నుంచి నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. విమానం కుడి వైపుకి ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో 127 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఆగేంతవరకు వారంతా భయాందోళనకు గురయ్యారు. అనంతరం జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి మాట్లాడుతూ టెక్నికల్ సమస్యలు ప్రధాన్ గేర్లో తలెత్తడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ఈ ఘటనతో ప్రధాన రన్ వేను కాసేపు మూసివేసి, మరొక రన్ వేను ఉపయోగించారు.
Samayam Telugu mumbai delhi flight suffers tyre burst runway operations affected
రన్ వే పైనే పేలిన విమానం టైరు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.