యాప్నగరం

భర్తను చంపి.. సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేసింది!

ఓ మహిళ తన భర్తను హత్యచేసి, సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసిన ఘటన 13 ఏళ్ల తర్వాత వెలుగులోకి చూసింది.

Samayam Telugu 7 Dec 2017, 8:07 pm
మహిళ తన భర్తను హత్యచేసి, సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసిన ఘటన ఒకటి 13 ఏళ్ల తర్వాత వెలుగులోకి చూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని గాంధీపడలో ఫరీదా భారతి అనే మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహించడమే కాకుండా తన భర్తతో సహా అనేక మందిని హత్య చేసిందనే సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు బుధవారం ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. సెప్టెక్‌ ట్యాంకులో పుర్రె, అస్థిపంజరం బయటపడ్డాయి. భర్త సహదేవ్ (30) నిద్రలో ఉండగా తలపై కొట్టి చంపినట్టు ఫరీదా పోలీసు విచారణలో తెలిపింది.
Samayam Telugu mumbai woman killed husband dumped body in septic tank for 13 years
భర్తను చంపి.. సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చేసింది!


ఫరిదా ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఫరీదాతో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆధీనంలో ఉన్న నలుగురు మహిళలకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. విచారణలో ఆమె భర్తను చంపిన విషయం తెలిసింది. దీంతో మళ్లీ ఆ ఇంట్లో సోదాలు చేయగా సహదేవ్ అస్థికలు సెప్టిక్ ట్యాంకులో కనిపించాయి. అయితే, ఎందుకు చంపిందో కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.