యాప్నగరం

హీరోయిన్‌తో స్వామీజీ రాసలీలలు!

భక్తిపేరుతో మహిళలను వాడుకోవడం బాబాలు, స్వామీజీల అలవాటుగా మారిపోయింది. తాజాగా కర్ణాటకలో మరో స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది.

TNN 26 Oct 2017, 9:22 pm
భక్తిపేరుతో మహిళలను వాడుకోవడం బాబాలు, స్వామీజీల అలవాటుగా మారిపోయింది. తాజాగా కర్ణాటకలో మరో స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది. బెంగళూరు సమీపంలోని మద్దేవనపురలో తన మఠంలోనే నంజీశ్వర్‌ స్వామీజీ ఓ సినీనటితో శృంగారంలో పాల్గొన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మఠంలోని తన గదిలో స్వామీజీతో ఆమె సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్నారు. అయితే, ఆ నటి ఎవరనేది పూర్తి వివరాలు తెలియరాలేదు. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి కుమారుడైన నంజీశ్వర్‌ ప్రస్తుతం మఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Samayam Telugu nanjeshwar swamiji caught in sex scandal with actress on hidden camera
హీరోయిన్‌తో స్వామీజీ రాసలీలలు!

నంజీశ్వర్‌ స్వామీజీ అలియాస్‌ దయానంద్‌ 2011లోనే ఈ మఠానికి అధిపతి కావాలన్న ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఆయన తన పేరును దయానంద్‌గా మార్చుకున్నారు. అంతేకాదు మఠానికి కేటాయించిన భూముల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారాలు ఆయనకేమీ కొత్తకాదని, గతంలో ఎంతోమంది మహిళలతో ఆయనకు శారీరక సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. రహస్యంగా ఏర్పాటుచేసిన కెమెరా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న ఈ దృశ్యాలను చూసి మఠం వద్దకు చేరుకున్న భక్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. కొందరు స్వాములు సైతం దయానంద్‌ తక్షణమే మఠం బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మఠం వద్ద పోలీసులు మోహరించారు. బెంగళూరు నగర నార్త్ ఈస్ట్ జోన్‌ డీసీపీ గిరీశ్‌ మాట్లాడుతూ.. తమకు దయానందపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ మఠం సంరక్షణలో 220 ఎకరాల భూమి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.