న్యూఢిల్లీ: 168 మంది ప్రయాణికులతో ముంబయి నుంచి బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ రన్వేను ఢీకొట్టింది. ఈ నెల 22న చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఫిర్యాదు నమోదైంది. 160 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ముంబయి నుంచి బయల్దేరిన 9w-276 విమానం.. డాకాలో దిగుతుండగా... విమానం వెనుక(టైల్) భాగం రన్వేను ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని విమానయాన సంస్థ వెల్లడించింది. సాధారణంగా విమానంలో ఏ భాగమైన రన్వేను ఢీకొట్టినా, తాకినా నిప్పు రవ్వలు ఏర్పడి భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే, లక్కీగా ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన పైలెట్ను జెట్ ఎయిర్వేస్ విధుల నుంచి తప్పించింది. ఈ ఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టవచ్చని తెలిసింది.
రన్వేను ఢీకొన్న జెట్ ఎయిర్వేస్ విమానం
168 మంది ప్రయాణికులతో ముంబయి నుంచి బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ రన్వేను ఢీకొట్టింది.
TNN 24 Jan 2017, 5:36 pm