యాప్నగరం

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి బలైన ఆవుకు ఘన నివాళి!

రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వాకం ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన ఆవుకు మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా నివాళి అర్పించింది..

TNN 22 Jul 2017, 9:03 pm
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వాకం ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన ఆవుకు మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా నివాళి అర్పించింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యుషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఈడీసీఎల్) నాసిక్‌లోని ఓ ప్రాంతంలో విద్యుత్ కేబుళ్లు వేసే పనులు ప్రారంభించింది. ఇందులో భాగంగా తవ్విన ఓ గుంతలో పడిన ఆవు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. జులై 13న జరిగిన ఈ ఘటనపై శివసేన పార్టీ నాసిక్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.
Samayam Telugu nashik municipal corporation pays tribute to cow
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి బలైన ఆవుకు ఘన నివాళి!


నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శివసేన పార్టీ నుంచి కార్పొరేటర్‌గా ఉన్న శ్యామ్ కుమార్ ఆ ఆవుకు అంతిమక్రియలు నిర్వహించాడు. ఎన్‌ఎంసీ నిర్లక్ష్యానికి ఆ మూగజీవి బలైన విధాన్ని ఆయన ఎండగట్టారు. ఒకవైపు అధికార బీజేపీ సభ్యులు గోమాత గురించి గొప్పగా చెబుతుండగా.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.

తమ సిబ్బంది నిర్లక్ష్యానికే ఆ ఆవు బలైన కారణంగా.. దానికి అధికారికంగా నివాళి అర్పించాలని శ్యామ్ కుమార్ ఎన్‌ఎంసీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆవుల విషయంలో సానుకూల ధోరణితో ఉన్న బీజేపీ తప్పనిసరిగా దీనికి ఆమోదం తెలపాల్సి వచ్చింది. దీంతో గురువారం (జులై 21) ఎన్‌ఎంసీలో సదరు ఆవుకు ఘనంగా నివాళి అర్పించారు. దేశంలో ఇలాంటి నివాళి ఇదే ప్రథమం.
Read this in Marathi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.