యాప్నగరం

ఆ బాబా పెట్టెలో... నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు

ఫైజాబాద్ లో గుమ్నామీ బాబాగా జీవించిన వ్యక్తి నేతాజీయే అంటూ ఇప్పటికే చాలా మంది వాదిస్తున్నారు.

TNN 16 Mar 2016, 10:10 am
నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదా? అక్కణ్నించి బయటపడి ఓ బాబా రూపంలో జీవించారా? ఈ ప్రశ్నలకు నిజమే అని సమాధానం ఇవ్వాల్సి రావచ్చు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో గుమ్నామీ బాబాగా జీవించిన వ్యక్తి నేతాజీయే అంటూ ఇప్పటికే చాలా మంది వాదిస్తున్నారు. ఆ వాదనలకు బలం చేకూర్చేలా... మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి. గుమ్నామీ బాబా చనిపోయాక అతని తాలూకు వస్తువులను ఓ పెట్టెలో పెట్టి భద్రపరిచారు. అయితే గుమ్నామీ బాబానే నేతాజీ అనే వాదనలు ఎక్కువగా వస్తుండడంతో అధికారులు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఆధారాలేమన్న దొరుకుతాయేమో వెతికారు. కాగా ఆ పెట్టెలో పాత టైప్ రైటర్, కొన్ని పాత వస్తువులు బయటపడ్డాయి. అలాగే అడుగున... ఓ ఫ్యామిలీ ఫోటో బయటపడింది. అది ఇంకెవరిదో కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం. ఆ ఫోటోలో నేతాజీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, వారి పిల్లలు ఉన్నారు. మొత్తం 22 మంది ఆ ఫోటోలో ఉన్నారు. అలాగే మరో ఫోటో కూడా దొరికింది. అది నేతాజీ తల్లిదండ్రులైన జానకినాథ్ బోస్, ప్రభావతిలది. అలాగే కొన్ని ఉత్తరాలు కూడా బయటపడ్డాయి. నేతాజీ పుట్టినరోజున ఆ ఉత్తరాలు వచ్చినట్టు అధికారులు కనుగొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన పబిత్రా మోహన్ రాయ్, సునీల్ కాంత్ గుప్తా వంటి వారు రాసిన లేఖలు కూడా పెట్టెలో ఉన్నాయి. దీనిని గుమ్నామీ బాబానే నేతాజీ అని చెప్పడానికి ఆధారాలు దొరికినట్టు అయింది.
Samayam Telugu netaji subhas chandra boses family pictures found in gumnami babas box
ఆ బాబా పెట్టెలో... నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు


గుమ్నామీ బాబా తన చివరి మూడేళ్లు శక్తి సింగ్ అనే వ్యక్తికి చెందిన రామ్ భవన్లో గడిపారు. అక్కడే 1985లో సెప్టెంబర్ 16న మరణించారు. కాగా నేతాజీ అన్న కూతురైన లలితా బోస్ 1986, ఫిబ్రవరి 4న రామ్ భవన్ వచ్చి వెళ్లినట్టు శక్తి సింగ్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.