యాప్నగరం

ప్రాణం నిలిపిన సోషల్ మీడియా!

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ యువకుడి వద్ద డబ్బు లేకపోవడంతో డాక్టర్లు వైద్యం ఆపేశారు. తన బాధను సోషల్ మీడియాతో పంచుకున్న ఆ యువకుడికి నెటిజన్స్ ఎలా ఆదుకున్నారో చూడండి.

TNN 17 Nov 2017, 3:13 pm
ముంబయికి చెందిన 25 ఏళ్ల రుషి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇందుకు దాదాపు ఎనిమిది కిమోథెరఫీలు ఇవ్వాల్సి ఉంది. అయితే, తన ఆదాయం అంతంత మాత్రమే కావడంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి కిమోథెరఫీకి రూ.2.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. చికిత్సకు దాదాపు రూ.25 లక్షలు అవసరం. అంత డబ్బు చెల్లించలేక రుషి చికిత్సను మధ్యలోనే ఆపేశాడు. ఈ విషయాన్ని ‘హ్యుమన్స్ ఆఫ్ బొంబై’ ఫేస్‌బుక్ పేజీ ద్వారా పంచుకున్నాడు. చివరిలో తనకు ఆర్థిక సాయం చేసేందుకు ఫండ్ రైజర్ లింక్ కూడా పెట్టాడు. అతడి వైద్యానికి సంబంధించిన వివరాలు, ఆధారాలు అందులో జత చేశాడు. అతడి ఆవేదన అర్థం చేసుకున్న సోషల్ మీడియా యూజర్లు... వెంటనే స్పందించారు. కేవలం ఒక్క రోజులోనే రూ.25 లక్షలు దానం చేసి తమ దాతృత్వం చాటుకున్నారు.
Samayam Telugu netizens helped him for cancer treatment
ప్రాణం నిలిపిన సోషల్ మీడియా!





(గమనిక: సోషల్ మీడియాలో ఆర్థిక సహాయంపై వచ్చే కథనాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సాయం చేయండి. వీలైతే బాధితుడి వివరాలు, ఫోన్ నెంబర్లు, అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలను కూడా సేకరించి, వాస్తవం అని నమ్మిన తర్వాతే సాయం చేయగలరు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.