యాప్నగరం

మౌంటెయిన్ మ్యాన్: పిల్లల కోసం కొండను తవ్వి..!

అది ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం. కొండల మధ్యలో ఉంటుంది. ఆ గ్రామంలో ఒకటే ఇల్లు. ఆ ఇంటి యజమాని పేరు జలంధర్ నాయక్.

TNN 14 Jan 2018, 8:12 pm
అది ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం. కొండల మధ్యలో ఉంటుంది. ఆ గ్రామంలో ఒకటే ఇల్లు. ఆ ఇంటి యజమాని పేరు జలంధర్ నాయక్. భార్య, పిల్లలతో జీవిస్తున్నారు. అయితే వారు ఉంటున్న గుమ్సాహి గ్రామం నుంచి బయటి ప్రపంచానికి రోడ్డు మార్గం లేదు. దగ్గరలోని ఫుల్బాని పట్టణానికి రావాలంటే కొండలు, గుట్టలు ఎక్కి దిగాలి. దీంతో ఆయన పిల్లలు స్కూలుకెళ్లడం కష్టంగా మారింది. అంతే తన పిల్లలు స్కూలుకెళ్లడం కోసం కొండను తవ్వాలనుకున్నాడు.
Samayam Telugu odisha mountain man carves road through hills for his children to attend school
మౌంటెయిన్ మ్యాన్: పిల్లల కోసం కొండను తవ్వి..!


45 ఏళ్ల వయసులో రోజుకి 8 గంటలపాటు కష్టపడి రెండేళ్లలో 8 కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వేశాడు. ఆ రోడ్డు ద్వారా వాహనాలు వెళ్లే విధంగా ఆయన నిర్మించాడు. వచ్చే మూడేళ్లలో మరో 7 కిలోమీటర్ల రోడ్డు తవ్వేస్తానని ఆయన చెబుతున్నాడు. వాస్తవానికి ఈ గ్రామంలో చాలా కుటుంబాలే ఉండేవి. గ్రామానికి సరైన రోడ్డు, ప్రభుత్వ పరంగా ఎలాంటి సదుపాయాలు అందట్లేదని ఆ మిగిలిన కుటుంబాలననీ ఖాళీ చేశాయి. కానీ నాయక్ మాత్రం సొంతూరుని వదిలిపెట్టలేదు. తన పిల్లల సౌఖర్యం కోసం కష్టపడి రోడ్డును నిర్మించాడు. ఈ మొత్తం రోడ్డును నాయకే స్వయంగా నిర్మించినట్లు జిల్లా యంత్రాంగం కూడా ధ్రువీకరించింది. వారికి ఆ గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.