యాప్నగరం

వీడియో: ప్లాట్‌ఫాం-ట్రైన్.. మధ్యలో యువకుడు

ఇది అలాంటి ఇలాంటి ఎస్కేప్ కాదు. ప్లాట్ ఫాం వద్దకు లోకల్ ట్రైన్ వేగంగా వస్తోంది.

TNN 29 Nov 2017, 3:46 pm
ఇది అలాంటి ఇలాంటి ఎస్కేప్ కాదు. ప్లాట్ ఫాం వద్దకు లోకల్ ట్రైన్ వేగంగా వస్తోంది. అదే సమయంలో ఓ యువకుడు ట్రాక్‌ను దాటుకొని ప్లాట్‌ఫాం పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంకి ట్రైన్‌కి మధ్యలో ఇరుక్కుపోయాడు. ట్రైన్ అతన్ని అలాగే కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు పరిగెత్తుకుని యువకుడి వద్దకు వెళ్లారు. అక్కడున్న కొంత ప్రయాణికుల సహాయంతో అతన్ని బయటికి తీశారు. ఈ ఘటన మంగళవారం ముంబైలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన యువకుడి పేరు మహమ్మద్ ముస్తఫా షేక్. అతని వయసు 24 ఏళ్లు. ప్రమాదంలో ముస్తఫా రెండు చేతులూ విరిగిపోయాయి. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముస్తఫాను రైలు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.