పేరుకే అది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) .. చేతల్లో మాత్రం మహా విధ్వంస సేనగా ఈ మధ్య కాలంలో పేరుపడుతోంది. శివసేన మాదిరిగానే స్థానికేతరులకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఎంఎన్ఎస్ వల్ల స్థానికులు కూడా పలు ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. చిన్నపాటి వివాదానికే ఎంఎన్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అమాయకులు, బీదలపై ప్రతాపం చూపుతూ అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ. ముంబైలోని ఘాటక్పూర్ ప్రాంతంలో వీధి వెంబడి పండ్లను అమ్ముకుంటూ బతికే ఒక వ్యక్తిపై జులుంకు దిగిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు పాపం అతని పండ్ల బండిని తలకిందులు చేసేసారు. పండ్లన్నింటిని రోడ్డుపై చెల్లాచెదురు చేసి అంతుచూస్తామని బెదిరించడం పెద్ద ఎత్తున విమర్శలు రేగేలా చేసింది.
పార్టీ కార్యకర్తలా.. వీధి రౌడీలా (వీడియో)
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
TNN & Agencies 8 Sep 2016, 5:37 pm