యాప్నగరం

చేపలు కూర వల్ల ప్రాణం పోయింది

చేపల కూర ఓ వ్యక్తి ప్రాణం తీయగా... నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది.

TNN 8 Nov 2016, 2:56 pm
చేపల కూర ఓ వ్యక్తి ప్రాణం తీయగా... నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది. తమిళనాడులోని కడలూరు జిల్లా బన్నుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతంలో నివసిస్తోంది నారాయణ స్వామి (50) కుటుంబం నివసిస్తోంది. వారుండే గ్రామంలోకి కొంతమంది చేపలను అమ్మకానికి తెచ్చారు. వారి దగ్గర చేపలు కొన్న స్వామి వాటిని భార్యకిచ్చి వండమన్నాడు. భార్య కూర వండాక స్వామి, అతని భార్య, మామ, అత్త, అతని చెల్లెలు కలిసి భోజనం చేశారు. కూర తిన్న కాసేపటికే వారికి వాంతులు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Samayam Telugu one died four people fall sick after eating fish curry
చేపలు కూర వల్ల ప్రాణం పోయింది


ఇరుగుపొరుగువారు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి విషమించడంతో స్వామి మామ పెరుమాళ్ (70) మరణించారు. మిగతా నలుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.