జోధ్ పూర్ అబ్బాయి నరేష్ తేవాని, పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ప్రియా బచ్చానిలకు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థమైంది. మూడు నెలల క్రితం నవంబర్ 7 (సోమవారం)న ఇరు కుటుంబాలు పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నాయి. పెళ్లి వేడుకను వరుడి ఇంట్లో (జోధ్ పూర్)నే జరపాలని నిర్ణయించారు.
వధూవరులతో పాటు పెద్దలు కూడా పెళ్లి పనుల్లో బిజీగా అయిపోయారు. కానీ రెండు నెలలుగా భారత్-పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో పెళ్లి సంబంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పెళ్లి తేదీ దగ్గర పడునున్న పెళ్లి కూతురు సహా, ఆమె కుటుంబ సభ్యులకు భారత్ రావడానికి వీసాలు మంజూరు కావడం లేదు. దీంతో పెళ్లి ఇప్పట్లో జరిగేలా లేదని అంతా భావించారు. ఒక దశలో కేన్సిల్ చేసుకునేందుమా అని కూడా ఆలోచించారు.
పెళ్లి కొడుకు నరేష్, అతని కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులకు వీసాలు రాని విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు వివరించారు. తక్షణమే స్పందించిన సుష్మా..సంబంధిత ఇరుదేశాల అధికారులతో మాట్లాడి అమ్మాయి తరపున 35 మందికి వీసాలు మంజూరయ్యేలా చూశారు.
ఆదివారం ప్రియా, ఆమె బంధువులు జోధ్ పూర్ చేరుకున్నారు.
నిర్ణయించిన ముహుర్థానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెళ్లి జరుగుతుండటంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
‘మా విజ్ఞప్తిని మన్నించి తక్షణమే పెళ్లి కూతురు తరపున 35మందికి వీసాలు మంజూరు చేయించిన మంత్రి సుష్మాగారికి థాంక్స్’ తెలిపాడు వరుడు నరేష్.
అటు వధువు ప్రియ కూడా అన్ని సమయానికి జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
పెళ్లికి వచ్చే వారికి రెండు విడతలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేసింది.
ఒక బృందం వాఘా సరిహద్దు గూండా జోధ్ పూర్ చేరుకోగా, మరో బృందం థార్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఇండియా చేరుకున్నారు.
ఈరోజే (సోమవారం) మూడు ముళ్లతో ఒక్కటవుతున్న ఇండియన్ అబ్బాయి నరేష్..పాకిస్థాన్ అమ్మాయి ప్రియలకు హ్యాపీ మ్యారిడ్ లైఫ్.
వధూవరులతో పాటు పెద్దలు కూడా పెళ్లి పనుల్లో బిజీగా అయిపోయారు. కానీ రెండు నెలలుగా భారత్-పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో పెళ్లి సంబంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పెళ్లి తేదీ దగ్గర పడునున్న పెళ్లి కూతురు సహా, ఆమె కుటుంబ సభ్యులకు భారత్ రావడానికి వీసాలు మంజూరు కావడం లేదు. దీంతో పెళ్లి ఇప్పట్లో జరిగేలా లేదని అంతా భావించారు. ఒక దశలో కేన్సిల్ చేసుకునేందుమా అని కూడా ఆలోచించారు.
పెళ్లి కొడుకు నరేష్, అతని కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులకు వీసాలు రాని విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు వివరించారు. తక్షణమే స్పందించిన సుష్మా..సంబంధిత ఇరుదేశాల అధికారులతో మాట్లాడి అమ్మాయి తరపున 35 మందికి వీసాలు మంజూరయ్యేలా చూశారు.
ఆదివారం ప్రియా, ఆమె బంధువులు జోధ్ పూర్ చేరుకున్నారు.
నిర్ణయించిన ముహుర్థానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెళ్లి జరుగుతుండటంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
‘మా విజ్ఞప్తిని మన్నించి తక్షణమే పెళ్లి కూతురు తరపున 35మందికి వీసాలు మంజూరు చేయించిన మంత్రి సుష్మాగారికి థాంక్స్’ తెలిపాడు వరుడు నరేష్.
అటు వధువు ప్రియ కూడా అన్ని సమయానికి జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
పెళ్లికి వచ్చే వారికి రెండు విడతలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేసింది.
ఒక బృందం వాఘా సరిహద్దు గూండా జోధ్ పూర్ చేరుకోగా, మరో బృందం థార్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఇండియా చేరుకున్నారు.
ఈరోజే (సోమవారం) మూడు ముళ్లతో ఒక్కటవుతున్న ఇండియన్ అబ్బాయి నరేష్..పాకిస్థాన్ అమ్మాయి ప్రియలకు హ్యాపీ మ్యారిడ్ లైఫ్.