యాప్నగరం

కన్నకూతురినే పెట్రోల్ పోసి చంపింది

ప్రేమ వివాహం చేసుకున్నదనే ఉక్రోషంతో సాక్షాత్తు కన్నతల్లే ఆ యువతిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది

TNN 8 Jun 2016, 7:07 pm
ప్రేమ వివాహం చేసుకున్నదనే ఉక్రోషంతో సాక్షాత్తు కన్నతల్లే ఆ యువతిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది. పాకిస్థాన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. లాహోర్ నగరం ఈ పరువు హత్యకు కేంద్రమైంది. జీనత్ అనే 18ఏళ్ల టీనేజర్ హసన్ అనే పొరుగింటి యువకుడితో ప్రేమలో పడింది. తన ప్రేమ వ్యవహారాన్ని గురించి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాలని కూడా తెగ ప్రయత్నించింది. కానీ తల్లి పర్వీన్ ఇందుకు ససేమిరా అంది. దాంతో ఆమె ఇటీవలే హసన్ ను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల తరువాత తన తల్లికి ఫోన్ చేసి తన తప్పును మన్నించాలని వేడుకుంది. దానికి అంగీకరించినట్లు నటించిన పర్వీన్, జీనత్ ను పుట్టింటికి వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకుని వెళ్లమంటూ ప్రేమగా పిలిచింది. కన్నతల్లి మాటలు కేవలం నటన అని తెలుసుకోలేని ఆ నవ వధువు ఎన్నో ఆశలతో తన పుట్టింటికి వెళ్లింది. ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టీపెట్టగానే పర్వీన్ దాడికి దిగింది. జీనత్ సోదరుడు కూడా ఆ దాడిలో పాల్గొన్నాడు. ఆమెను తీవ్రంగా హింసించిన తరువాత ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో జీనత్ అక్కడికక్కడే సజీవదహనమైపోయింది.
Samayam Telugu pakistani girl burned alive by mother over love marriage
కన్నకూతురినే పెట్రోల్ పోసి చంపింది


దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు కబురంపగా వారు వచ్చి పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారైపోయాడు. ప్రస్తుతం అతగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కుమార్తె క్షమించరాని నేరం చేసినందువల్లే ఆమెను సజీవదహనం చేసానని పర్వీన్ పోలీసుల ఎదుట అంగీకరించింది.


(జీనత్ తో వివాహమైనట్లు పాక్ వివాహ రిజిస్ట్రేషన్ల శాఖ జారీచేసిన సర్టిఫికెట్టుతో ఆమె భర్త హసన్)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.