యాప్నగరం

లైవ్‌లో మాట్లాడుతూ.. కుప్పకూలిన రిపోర్టర్!

ఓ కార్యక్రమం కవరేజ్ కోసం వెళ్లిన ఓ మహిళా రిపోర్టర్.. లైవ్‌లో సమాచారం అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన

TNN 28 Jun 2017, 8:05 pm
కార్యక్రమం కవరేజ్ కోసం వెళ్లిన ఓ మహిళా రిపోర్టర్.. లైవ్‌లో సమాచారం అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకుంది. టీవీ 92 ఛానెల్‌కు చెందిన ఇర్జా ఖాన్.. సభా ప్రాంగణం మొత్తం కనిపించడం కోసం క్రేన్‌పై కూర్చొని లైవ్ ఇవ్వడం ప్రారంభించింది. సమాచారం అందిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దాదాపు పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటన ఏడాది కిందట చోటు చేసుకుంది.
Samayam Telugu pakistani reporter died during live coverage
లైవ్‌లో మాట్లాడుతూ.. కుప్పకూలిన రిపోర్టర్!


తాజాగా బయటకు వచ్చిన ఆ వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఏఆర్‌వై న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న ఆమె.. ఈ రూమర్లు చూసి షాకైంది. పాపం.. ఇర్జా ట్విట్టర్ ద్వారా నేను బతికే ఉన్నానని మొర పెట్టుకుంటున్నా, ఆ వీడియో అలా వైరల్‌గా పాకుతూ పాకుతూ పాకిస్థాన్ నుంచి ఇండియాకు చేరింది.

అప్పటివరకు తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల స్పృహ కోల్పోయానని, పైనుంచి పడటం వల్ల నడుముకు గాయమైందని ఆమె తెలిపింది.
https://t.co/C23lZZBIBa via @youtube Rumours are spreading that i am dead .. it's an old one guys I am alive #IrzaIsAlive #AskIrza — Irza Khan (@irzakhaan) June 27, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.