యాప్నగరం

ఆ నోటు గురించి తెలుసా?

మన అందరికీ ఒకరూపాయి నోటు నుంచి వెయ్యి రూపాయల నోటు దాకా తెలుసు. తాజాగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రూ.2,000 నోట్లను విడుదల చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

TNN 7 Nov 2016, 4:54 pm
మన అందరికీ ఒకరూపాయి నోటు నుంచి వెయ్యి రూపాయల నోటు దాకా తెలుసు. తాజాగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రూ.2,000 నోట్లను విడుదల చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. వాటిని కూడా మనం నెట్‌లో చూశాం. గతంలో ఆర్‌బీఐ ప్రింట్ చేసిన అతిపెద్ద కరెన్సీ నోట్లుగా రూ.10,000 నోట్లు ఉండేవి. 1938కి ముందు, 1954లోనూ ఈ నోట్లు ప్రింట్ అయ్యాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. మీరు జీరో రూపాయి నోటు చూశారా? కొందరు చూసే ఉంటారు. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.
Samayam Telugu people are using this zero rupee note to weed out corruption in india and this is how it works
ఆ నోటు గురించి తెలుసా?


ఫిఫ్త్‌ పిల్లర్‌ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్థ 2007లో ప్రారంభించిందే ఈ జీరో నోట్ల ముద్రణ. అవి అచ్చం 50 రూపాయల నోట్లను పోలివుంటాయి, గాంధీ బొమ్మతో అదే రంగులో..కానీ,అవి విలువ లేనివని వాటిపై ముద్రణ ఉంటుంది. ఎవరైనా అధికారి లంచం అడిగితే పౌరులు దాన్ని ఇవ్వాలి. 'నేను లంచం ఇవ్వను, తీసుకోనని ప్రమాణం చేస్తున్నా' అన్న హెచ్చరిక ఆ నోట్‌పై ఉంటుంది. ఇటువంటి నోట్‌ అధికారులకిచ్చినపుడు తమ డిమాండ్‌ చట్ట విరుద్ధమన్న అవమానకర భావన వాళ్లలో కలుగుతుందన్నదే దీని ప్రచారకర్తల ఆలోచన. దీని ద్వారా వారు సాధించిన ఫలితాలపై అనేక కథనాలను ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. అవినీతిపరుల్లో ఈ ప్రక్రియ మార్పు తెచ్చిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ సాధించిన విజయం అవినీతి ప్రమాదకరస్థాయిలో ఉన్న నేపాల్‌, ఘనా, బెనిన్‌, మెక్సికో, యెమెన్‌వంటి దేశాలపైనా ప్రభావం చూపింది. ఐతే, దీని ద్వారా నిజమైన మార్పు సాధ్యమా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. లంచగొండితనంపై ఫిఫ్త్ పిల్లర్ అధ్యక్షుడు విజయ్ ఆనంద్ నిర్వహిస్తున్న పోరాటం మాత్రం అభినందనీయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.