యాప్నగరం

రైల్వేశాఖ పేరిట హాస్పిటల్లో బ్లాక్ మనీ పంచారు!

కాన్పూర్ రైలు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారికి రైల్వే శాఖ పేరిట కొందరు వ్యక్తులు రద్దు చేసిన నోట్లను పంచిపెట్టారు.

TNN 21 Nov 2016, 10:02 am
కాన్పూర్ రైలు ప్రమాదంలో 125 మందికిపైగా చనిపోగా, 200 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో క్షతగాత్రులుగా మారి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారికి కొందరు రద్దు చేసిన రూ.500 నోట్లను పంచిపెట్టారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున పది 500 నోట్లను చొప్పున పంచిపెట్టారని ఆ నోట్లను తీసుకున్న ఆశా, అనిల్ చెప్పారు. గాయాలతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బంధువుకు కూడా ఇదే తరహాలో ఒకతను డబ్బులిచ్చాడు. మీరెవరు అని ప్రశ్నించగా, ఈ సొమ్మును రైల్వేశాఖ పంచిందని చెప్పాడు.
Samayam Telugu people injured in derailment given old rs 500 notes at hospital
రైల్వేశాఖ పేరిట హాస్పిటల్లో బ్లాక్ మనీ పంచారు!


ఈ డబ్బును ఎవరు పంచారనే విషయం తమకు తెలియదని బీజేపీ నాయకుడు ఆర్పీ సింగ్ తెలిపారు. ఇది రాజకీయ పార్టీ లేదా రైల్వే ఉద్యోగుల పని కావచ్చిన ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డబ్బును రైల్వే శాఖే పంచిందా లేదా అనే విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన కాన్పూర్ దెహత్ జిల్లాలోని మతి హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడి వివరాలు తీసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.