ప్రయాణికులపై ఇండిగో విమానయాన సిబ్బంది దురుసు ప్రవర్తన ఉదంతాలు మరచిపోక ముందే మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా వార్తల్లోకి వచ్చింది. ఆ విమానయాన సంస్థలో పనిచేసే ఓ పైలట్పై కేరళలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పైలట్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా సిబ్బంది ఫిర్యాదు చేసింది. ఆ పైలట్ కారణంగా తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. విమానంలో వెళుతున్న సమయంలో సదరు పైలట్ తనతో అనేక సార్లు చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పేర్కొంది. గత సెప్టెంబర్ 18న విధుల్లో ఉన్న ఆమెపై పైలట్ మరోసారి వేధింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
సదరు పైలట్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 18న విమానంలో పైలట్తో పాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాంచీ నుంచి బెంగళూరు వెళుతున్న ఎయిర్ఏషియాకు చెందిన ఓ విమానంలోనూ ముగ్గురు సిబ్బంది ఓ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది.
సదరు పైలట్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 18న విమానంలో పైలట్తో పాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాంచీ నుంచి బెంగళూరు వెళుతున్న ఎయిర్ఏషియాకు చెందిన ఓ విమానంలోనూ ముగ్గురు సిబ్బంది ఓ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది.