యాప్నగరం

దేశంలో ఈ ఏడాది 76 పులుల మృతి

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 76 పులులు మృత్యువాత పడినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

TNN 7 Nov 2016, 11:05 am
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 76 పులులు మృత్యువాత పడినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అత్యధిక మరణాలు మధ్యప్రదేశ్‌లో సంభవించాయి. మొత్తం పులుల మరణాల్లో మూడో వంతు మధ్యప్రదేశ్‌లో నమోదు కావడం గమనార్హం. పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న కర్ణాటక 13 మరణాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ, ట్రాఫిక్-ఇండియా (TRAFFIC-India)తో కలసి ‘టైగర్‌నెట్’ ఈ నివేదికను విడుదల చేసింది
Samayam Telugu poaching alert 76 tigers dead this year
దేశంలో ఈ ఏడాది 76 పులుల మృతి


2010 నుంచి చూస్తే పులుల మరణాల సంఖ్య ఇప్పుడే అధికం. 2015 సంవత్సరం మొత్తంలో 69 పులులు మృతిచెందినట్లు అప్పట్లో తేలింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పులుల మృత కళేబరాలను గుర్తించడంతో దొంగతనంగా పులులను వేటాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు 20 మృతిచెందిన పులుల అవయవాలను గుర్తించినట్లు కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఇదే అధికం. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో గత నెలలో ఒక పులి మృత కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు.

కాగా, మృతిచెందిన 76 పులుల్లో 41 మరణాలపై ఇంకా విచారణ జరుగుతోంది. మిగిలిన పులులు ప్రత్యక్ష లేదా పరోక్ష మానవ ప్రమేయం వల్ల మరణించినవే. వేటాడటం, విషప్రయోగం, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాలు, పులుల మధ్య పోరు, ఇతర సహజ కారణాల వల్ల పులులు మృత్యువాత పడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.