విన్నూత్న ఆలోచనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిసుంటాయి. పుణే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా వివిధ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం చేస్తున్నాయి. వీధి నాటకాలు, మ్యాజిక్ షోలు, పాటలు, నృత్య పోటీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పాటలకు అనుగుణంగా స్త్రీ, పురుషుల సంప్రదాయ వస్త్రధారణతో నృత్యాలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి విన్నూత్న ప్రచారానికి ఖర్చు కూడా తక్కువే.
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గత అయిదు రోజులుగా ఇలాంటి ప్రచారంతో ముందంజలో ఉన్నాయి. పార్వతి వార్డులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రియా గడేడా తన ఏరియా సమస్యలను ఏలా పరిష్కరిస్తానో తెలుపుతూ పాపులర్ మరాఠీ సాంగ్ శాంతా బాయ్ను రీమిక్స్ చేశారు. గతంలో ఆమె మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన తరఫున ఈ వార్డు నుంచే కౌన్సెలర్గా ఎన్నికయ్యారు.
మరోవైపు శివసేన కూడా స్థానిక కళాకారులతో భాజపా, ఎన్సీపీలను విమర్శిస్తూ వీధి నాటకాలను ప్రదర్శిస్తుంది. అలాగే నాగ్పూర్లో కూడా నోట్ల రద్దు ప్రభావాన్ని వివరిస్తూ మ్యాజిక్ షో ఏర్పాటు చేసింది. కొత్త ఆలోచనలతో ఓటర్లు ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని కార్పొరేటర్గా పోటీలో ఉన్న భుజ్బల్ అన్నారు. ప్రత్యక్ష ప్రదర్శన ఓటర్లు ప్రభావితం చేస్తుందని, దీన్ని ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు.
ఎన్సీపీ కూడా ఆదివారం నుంచి వీధి నాటకాలను ప్రదర్శిస్తోంది. వీటిని ఫిబ్రవరి 19 వరకు కొనసాగిస్తుంది. గత అయిదేళ్లలో తాము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళలో కొనసాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గత అయిదు రోజులుగా ఇలాంటి ప్రచారంతో ముందంజలో ఉన్నాయి. పార్వతి వార్డులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రియా గడేడా తన ఏరియా సమస్యలను ఏలా పరిష్కరిస్తానో తెలుపుతూ పాపులర్ మరాఠీ సాంగ్ శాంతా బాయ్ను రీమిక్స్ చేశారు. గతంలో ఆమె మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన తరఫున ఈ వార్డు నుంచే కౌన్సెలర్గా ఎన్నికయ్యారు.
మరోవైపు శివసేన కూడా స్థానిక కళాకారులతో భాజపా, ఎన్సీపీలను విమర్శిస్తూ వీధి నాటకాలను ప్రదర్శిస్తుంది. అలాగే నాగ్పూర్లో కూడా నోట్ల రద్దు ప్రభావాన్ని వివరిస్తూ మ్యాజిక్ షో ఏర్పాటు చేసింది. కొత్త ఆలోచనలతో ఓటర్లు ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని కార్పొరేటర్గా పోటీలో ఉన్న భుజ్బల్ అన్నారు. ప్రత్యక్ష ప్రదర్శన ఓటర్లు ప్రభావితం చేస్తుందని, దీన్ని ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు.
ఎన్సీపీ కూడా ఆదివారం నుంచి వీధి నాటకాలను ప్రదర్శిస్తోంది. వీటిని ఫిబ్రవరి 19 వరకు కొనసాగిస్తుంది. గత అయిదేళ్లలో తాము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళలో కొనసాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.