వైద్య వృత్తిలో రోజురోజుకు విలువలు పడిపోతున్నాయి. డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని వైద్యుల ధనాశ నిండు ప్రాణాన్ని బలిగొంది. సరస్వతి అనే నిండు గర్భిణికి ప్రసవపు నొప్పులు రావడంతో ఆమెను కోర్బాలోని జమునాదేవి స్మారక ఆసుపత్రిలో చేర్చారు. కానీ, అప్పటికే ఆమె గర్భంలోని శిశువు చనిపోయింది. ఆపరేషన్ చేసి ఆ మృతశిశువును బయటకు తీయకపోతే సరస్వతి ప్రాణాలకే ముప్పని వైద్యులు చెప్పారు. ఇందుకు అవసరమైన సొమ్మును కడితే ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కానీ, సరస్వతి బంధువుల వద్ద అంత మొత్తం లేకపోవడంతో కాస్త గడువు ఇవ్వమని బతిమిలాడారు. కానీ, వైద్యులు కరగలేదు. సొమ్ము కడితేనే ఆపరేషన్ చేస్తామని బీష్మించుకు కూర్చోవడంతో ఆమె బంధువులు చేసేది లేక వేరే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఈలోపు జరగరాని ఘోరం జరిగిపోయింది. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సరస్వతి మరణించిందని బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసారు.
మహిళ ప్రాణం తీసిన వైద్యుల ధనాశ
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని వైద్యుల ధనాశ నిండు ప్రాణాన్ని బలిగొంది.
TNN 20 Sep 2016, 10:03 pm