యాప్నగరం

తల్లి విషయంలో గొడవ.. ఇద్దరు భార్యలను తగులబెట్టాడు!

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలను తగులబెట్టాడు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

TNN 20 Dec 2017, 4:32 pm
తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలను తగులబెట్టాడు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన దీపా రామ్ అనే వ్యక్తి గుజరాత్‌లో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే దీపా రామ్ తల్లి విషయంలో ఇద్దరు భార్యలతో కొంత కాలంగా తరచూ వాగ్వాదం జరుగుతోంది. దీంతో వారిపై అతడు కోపం పెంచుకున్నాడు. షాపింగ్ పేరుతో అతడు తన ఇద్దరు భార్యలు దరియా దేవి, మాలి దేవీని తీసుకొని కారులో బయలుదేరాడు.
Samayam Telugu quarrel over mother rajasthan man sets car on fire two wives die
తల్లి విషయంలో గొడవ.. ఇద్దరు భార్యలను తగులబెట్టాడు!


మార్గమధ్యలో వారి మధ్య మళ్లీ గొడవ తలెత్తింతి. దీంతో ఆగ్రహానికి గురైన దీపా రామ్.. కారును అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆపేశాడు. అందులోంచి బయటకు వచ్చి వెంటనే కారు డోర్లు లాక్ చేసి.. దానికి నిప్పంటించాడు. దీంతో వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ఘటనలో దీపా రామ్‌తో పాటు అతడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన అనంతరం దీపా రామ్.. తానే నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వాగ్వాదం ముదరడంతో భార్యల్లో ఒకరు కారు నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే.. దీపా రామ్ ఆమెను మళ్లీ కారులోకి నెట్టేసి అలాగే కొంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.