యాప్నగరం

రేప్ చేసిన వాణ్ని గుర్తుపట్టి.. చెంప పగలగొట్టింది!

రుతుస్రావం వేళలోనూ వదలని కామాంధుణ్ని గుర్తు పట్టిన బాధితురాలు అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గుజరాత్‌లో జరిగింది.

TNN 22 Mar 2017, 3:53 pm
అహ్మదాబాద్: తనపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుణ్ని గుర్తుపట్టిన బాధితురాలు అతడి చెంపలు పగలగొట్టిన ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. వివరాల్లో వెళితే.. అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయి తన తల్లితో కలిసి నివసిస్తోంది. తండ్రి చనిపోవడంతో వారిద్దరూ పని చేసుకొని జీవితాన్ని వెళ్లదీసేవారు. వంట చెరకు కోసం సదరు అమ్మాయి ఒక రోజు సమీపంలో కొత్తగా కడుతున్న ఓ భవంతి దగ్గరకెళ్లింది. వృథాగా మిగిలిపోయిన కట్టెలను తీసుకెళ్లొచ్చనే ఆశతో అక్కడికెళ్లిన ఆ అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. బాత్రూంలో చెక్కలు ఉన్నాయని నమ్మించిన 20 ఏళ్ల యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
Samayam Telugu rape victim recognise accused and slapped in ahmeabad
రేప్ చేసిన వాణ్ని గుర్తుపట్టి.. చెంప పగలగొట్టింది!


రుతుస్రావం అవుతున్నా.. ఆమె బాధతో విలవిల్లాడుతున్నా.. పట్టించుకొని ఆ దుర్మార్గుడు తన పశువాంఛ తీర్చుకున్నాడు. తర్వాత సదరు అమ్మాయి ఇంటికి వెళ్లగా.. దుస్తులకు రక్తం మరకలు ఉండటాన్ని గమనించిన ఆమె తల్లి ఏం జరిగిందంటూ.. ప్రశ్నించింది. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పిన బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తర్వాత స్థానికుల సాయంతో ఆ తల్లీ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. కొందరు అనుమానితులను తీసుకొచ్చిన పోలీసులు బాధితురాలి ముందు నిలబెట్టారు. వారిలో తనను రేప్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టిన బాధితురాలు ఆ కామాంధుడి చెంపలు వాయించింది.

ఆ దుర్మార్గుణ్ని తమకు అప్పగించాలని బాధితురాలి బంధువులు పోలీసులను కోరారు. కానీ న్యాయస్థానం ముందు హాజరుపర్చిన పోలీసులు ఆ నిందుతుణ్ని కటకటాల వెనక్కి పంపారు. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన 20 ఏళ్ల అజయ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.