యాప్నగరం

ఘోరం: పసిబిడ్డను విసిరేసి.. తల్లిని చెరబట్టి..

ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్ లో మరో ఘోరం జరిగింది. కదులుతున్న ఆటోలో ఒక మహిళపై ముగ్గురు

Samayam Telugu 6 Jun 2017, 10:44 am
ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్ లో మరో ఘోరం జరిగింది. కదులుతున్న ఆటోలో ఒక మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. 8 నెలల పసిబిడ్డతో ఆటో ఎక్కిన ఆమె...దుండగుల నుంచి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. అయినా ఆ పశువులు ఆమెను వదల్లేదు సరికదా.. తల్లి ఒడిలో గుక్కపెట్టి ఏడుస్తున్న పసిబిడ్డను విసిరిపారేశారు. దీంతో ఆ పసికూన రక్తమోడుతూ క్షణాల్లో కన్ను మూసింది.
Samayam Telugu rapists throw child from mother before they molest her
ఘోరం: పసిబిడ్డను విసిరేసి.. తల్లిని చెరబట్టి..


ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మే 29న అర్థరాత్రి సమయంలో జరిగింది. ఐఎంటీ మనేసర్ లో నివసించే 23ఏళ్ల మహిళకు పొరుగింటివారితో ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. అప్పటికే భర్త పని మీద ఊరెళ్లడంతో.. అదే రాత్రి 8నెలల కూతుర్ని తీసుకొని ఆ మహిళ మెయిన్ రోడ్డుపై నడిచి వెళ్లి ఓ ట్రక్ ఎక్కింది...ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద దిగింది.

అక్కడి నుంచి తన పేరెంట్స్ ఉంటున్న ఖందా రోడ్ కు వెళ్దామని ఓ ఆటోలో బయలుదేరింది. ‘నేను కూర్చున్న కొద్ది నిమిషాల్లో నన్ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. ఏడుస్తూ ఎంత వారిస్తున్నా వాళ్లు వదల్లేదు. నా బిడ్డ ఏడుస్తూ ఉంది. నా బిడ్డను లాక్కొని రోడ్డుపై విసిరేశారు. నా రోధన వాళ్లు పట్టించుకోలేదు.. నాపై అత్యాచారం జరిపి.. పారిపోయారు’ అంటూ బాధితురాలు మే 30 పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తొలుత తానెక్కిన ట్రక్కు డ్రైవర్ కూడా తాగి ఉన్నాడని.. తాను కూడా లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.