యాప్నగరం

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్లు పోలీసులపై దాడి చేశారు.

Samayam Telugu 25 Nov 2016, 2:42 pm
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్లు పోలీసులపై దాడి చేశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో ఎర్రచందనం విరివిగా పెరుగోతుంది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం..చందనం చెట్లు నరకడం నిషేదం. చట్టరీత్యా నేరం. అయితే కొంతమంది స్మగర్లు ముఠాలుగా ఏర్పడి తమిళనాడు, చిత్తూరు, కడప వంటి ప్రాంతాల నుంచి కూలీల సాయంతో అక్రమంగా ఎర్రచందనం చెట్లు నరికేస్తారు.
Samayam Telugu red sanders smugglers attack police in seshachalam forests
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి


చంద్రగిరి మండలం గుండాలకోనలో ఎర్రచందన చెట్లు నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు...పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం రాత్రి రంగంలోకి దిగిన పోలీసులు..అక్రమంగా ఎర్రచందనం చెట్లు నరుకుతున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్మగర్లు పోలీసులపైకి రాళ్లురువ్వి, కర్రలతో దాడి చేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

చందనం చెట్లు అక్రమంగా నరుకుతూ పోలీసులపైకి రాళ్లు రువ్విన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని తిరుపతికి తరలించారు.

స్మగ్మర్లు పోలీసులపై దాడి చేయడం మూడునెలల కాలంలో ఇది రెండోసారి.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పోలీసులు, అటవీశాఖ ఆధ్వర్యంలో శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.