యాప్నగరం

కేరళలోనే కుక్కలెక్కువ... ఎందుకో?

కేరళలో వీధికుక్కల సంఖ్యని నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

TNN 20 Oct 2016, 7:57 pm
కేరళలో వీధికుక్కల సంఖ్యని నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా కుక్కల బెడద కేరళలోనే ఎందుకు ఎక్కువగా ఉంటుందని ప్రశ్నించింది. జస్టిస్ అమిత్ రాయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పైవిధంగా అభిప్రాయపడింది. సమస్య తీవ్రంగా ఉంటే కుక్కల బాధితులకు పరిహారం కూడా చెల్లించవచ్చని ధర్మాసనం తెలిపింది. కేరళ ప్రభుత్వం తరుపు న్యాయవాది కుక్క కాటు బాధితులందరికీ పరిహారం ఇవ్వడం సాధ్యం పడదని చెప్పారు. జోస్ సెబాస్టియన్ అనే వ్యక్తి తన భార్య వీధికుక్కల దాడిలో మరణించిందని న్యాయం చేయమంటూ కోర్టుకెక్కారు. ఆ కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల నియంత్రణ, రేబిస్ వ్యాధి నియంత్రణ వంటి చర్యలు వెంటనే చేపటిడే ప్రయోజనం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.