యాప్నగరం

ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

గర్భస్త మహిళలు తప్పనిసరిగా (ప్రెగ్నెన్సీ) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం చట్టం చేయనుంది.

Samayam Telugu 10 Jun 2017, 1:07 pm
గర్భస్త మహిళలు తప్పనిసరిగా (ప్రెగ్నెన్సీ) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం చట్టం చేయనుంది. వచ్చే జులై నుంచి ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ కానుంది. ప్రెగ్నెన్సీ చేసుకున్నవారే ప్రసవం అనంతరం బిడ్డ పుట్టిన తేదీని రిజిస్ట్రేషన్ తోపాటు ధృవీకరణ పత్రం పొందడానికి అర్హులవుతారని రాష్ట్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Samayam Telugu registration of pregnancy mandate in tamil nadu
ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి


గర్భస్థ మహిళలు,వారి ప్రసవాలు సురక్షితంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ తెలిపారు. గర్భస్థ మహిళలు ఆరోగ్యం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య సలహాల కోసం 102 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ ద్వారా శిశు మరణాల రేటు తగ్గనుందని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.