దేవుడు చెబితేనే అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు!
మతవిశ్వాసాల పేరుతో ఓ తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దని భార్యకు హుకుం జారీ చేశాడు. దీంతో ఆ బిడ్డ పాలందక రోజంతా అలమటించాడు.
TNN 4 Nov 2016, 12:44 pm
మతవిశ్వాసాల పేరుతో ఓ తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దని భార్యకు హుకుం జారీ చేశాడు. దీంతో ఆ బిడ్డ పాలందక రోజంతా అలమటించాడు.
ఈ సంఘటన కేరళ కోజికోడ్ లోని ముక్కోంలో చోటు చేసుకుంది. ఒమెస్సెరీ గ్రామానికి చెందిన అబుబాకర్ అనే వ్యక్తిన తన భార్యను డెలివరీ కోసం ఈఎంఎస్ ఆసుపత్రిలో చేర్పించాడు.
ఆయన భార్య బుధవారం 1.30గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టగానే తల్లిపాలు (ముర్రుపాలు) పట్టిస్తే రోగనిరోధక శక్తి..పెరిగడంతో పాటు అన్నివిధాల మంచిదని వైద్యులు చెబుతారు. తల్లులు కూడా డెలివరీకాగానే తమ బిడ్డలను ఒళ్లోకి తీసుకొని...ముద్దుగా మురిపెంగా..పోతపాలకు బదులుగా తనపాలే ఇవ్వాలని తహతహలాడుతారు. అలాగే చేస్తారు. అబుబాకర్ భార్య కూడా ఎంతో సంతోషంగా తన బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆ భర్త అబుబాకర్ మాత్రం బిడ్డకు పాలివ్వడానికి వీల్లేదని తెగేసి చెప్పాడు. భార్య సహా బంధువులు అబుబాకర్ హెచ్చరికలకు అవాక్కయ్యారు.
అప్పటికే బిడ్డ పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తల్లి ఎంత ప్రయత్నించినా తండ్రి వద్దంటున్నాడు. కారణం అడిగితే..దేవుడు అనుమతి (ఆజాన్) వచ్చేంత వరకు పాలివ్వరాదని అన్నాడు.
ఒకవైపు బిడ్డ ఏడ్పుకు తల్లి గుండె పగిలిపోయింది. తల్లి వేదన రోదనగా మారింది. అబుబాకర్కు హాస్పిటల్ సిబ్బంది మొత్తం నచ్చచెప్పారు. అయినా వినిపించుకోలేదు. చివరికీ పోలీసులను పిలిచారు. పోలీసులకు కూడా అబుబాకర్ లొంగలేదు. పాలివ్వకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదమని చెప్పినా..‘నా కొడుకు బొడ్డ తాడు ఇంకా కోయలేదు. అందులో సరిపడా పోషక పదార్థాలున్నాయి. దానితో పాలివ్వకపోయినా 24గంటల వరకు ఏమీ కాదు’ అని మీడియాకు సైతం చెప్పాడు.
కనీసం బిడ్డ బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేస్తామన్నా వినిపించుకోలేదు.
ఎంతకాదాన్నా తల్లి ప్రాణం ఊరుకుంటుందా..భర్తతో బంధువులు, పోలీసులు, మీడియాలు, ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతుండగానే..గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆ తల్లి బిడ్డకు దొంగచాటుగా పాలిచ్చింది.
అప్పటికే అబుబాకర్పై బాలల హక్కుల సంరక్షణ కమిషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధమైంది. దీంతో అబుబాకర్ గురువారం రాత్రి తల్లిబిడ్డలను బలవలంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకెళ్లాడు.
‘పసి బిడ్డల హక్కులకు ఏరకంగా భంగం కలిగించినా..శిక్షార్హులు అవుతారు. మతం పేరుతో పాలివ్వకుండా అడ్డుకోవడం నేరం’ అని బాలల హక్కుల సంరక్షణ కమిషనర్ కె.నజీర్ తెలిపారు. అబుబాకర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సంఘటన కేరళ కోజికోడ్ లోని ముక్కోంలో చోటు చేసుకుంది. ఒమెస్సెరీ గ్రామానికి చెందిన అబుబాకర్ అనే వ్యక్తిన తన భార్యను డెలివరీ కోసం ఈఎంఎస్ ఆసుపత్రిలో చేర్పించాడు.
ఆయన భార్య బుధవారం 1.30గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టగానే తల్లిపాలు (ముర్రుపాలు) పట్టిస్తే రోగనిరోధక శక్తి..పెరిగడంతో పాటు అన్నివిధాల మంచిదని వైద్యులు చెబుతారు. తల్లులు కూడా డెలివరీకాగానే తమ బిడ్డలను ఒళ్లోకి తీసుకొని...ముద్దుగా మురిపెంగా..పోతపాలకు బదులుగా తనపాలే ఇవ్వాలని తహతహలాడుతారు. అలాగే చేస్తారు. అబుబాకర్ భార్య కూడా ఎంతో సంతోషంగా తన బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆ భర్త అబుబాకర్ మాత్రం బిడ్డకు పాలివ్వడానికి వీల్లేదని తెగేసి చెప్పాడు. భార్య సహా బంధువులు అబుబాకర్ హెచ్చరికలకు అవాక్కయ్యారు.
అప్పటికే బిడ్డ పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తల్లి ఎంత ప్రయత్నించినా తండ్రి వద్దంటున్నాడు. కారణం అడిగితే..దేవుడు అనుమతి (ఆజాన్) వచ్చేంత వరకు పాలివ్వరాదని అన్నాడు.
ఒకవైపు బిడ్డ ఏడ్పుకు తల్లి గుండె పగిలిపోయింది. తల్లి వేదన రోదనగా మారింది. అబుబాకర్కు హాస్పిటల్ సిబ్బంది మొత్తం నచ్చచెప్పారు. అయినా వినిపించుకోలేదు. చివరికీ పోలీసులను పిలిచారు. పోలీసులకు కూడా అబుబాకర్ లొంగలేదు. పాలివ్వకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదమని చెప్పినా..‘నా కొడుకు బొడ్డ తాడు ఇంకా కోయలేదు. అందులో సరిపడా పోషక పదార్థాలున్నాయి. దానితో పాలివ్వకపోయినా 24గంటల వరకు ఏమీ కాదు’ అని మీడియాకు సైతం చెప్పాడు.
కనీసం బిడ్డ బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేస్తామన్నా వినిపించుకోలేదు.
ఎంతకాదాన్నా తల్లి ప్రాణం ఊరుకుంటుందా..భర్తతో బంధువులు, పోలీసులు, మీడియాలు, ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతుండగానే..గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆ తల్లి బిడ్డకు దొంగచాటుగా పాలిచ్చింది.
అప్పటికే అబుబాకర్పై బాలల హక్కుల సంరక్షణ కమిషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధమైంది. దీంతో అబుబాకర్ గురువారం రాత్రి తల్లిబిడ్డలను బలవలంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకెళ్లాడు.
‘పసి బిడ్డల హక్కులకు ఏరకంగా భంగం కలిగించినా..శిక్షార్హులు అవుతారు. మతం పేరుతో పాలివ్వకుండా అడ్డుకోవడం నేరం’ అని బాలల హక్కుల సంరక్షణ కమిషనర్ కె.నజీర్ తెలిపారు. అబుబాకర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.