యాప్నగరం

ఆ మూడు గంటలు ఆమెకు నరకం

ఓ ఫామ్ హౌస్ లో వాచ్ మెన్ కుటుంబంపై తమ రాక్షసత్వాన్ని చూపించారు దోపిడీ దొంగలు.

TNN 24 Jan 2017, 3:45 pm
ఓ ఫామ్ హౌస్ లో వాచ్ మెన్ కుటుంబంపై తమ రాక్షసత్వాన్ని చూపించారు దోపిడీ దొంగలు. ఉత్తరప్రదేశ్ లోని జికర్ పూర్లో మాజీ డీఐజీ కె సింగ్ కు చెందిన ఫామ్ హౌస్ ఉంది. అందులో వాచ్ మెన్లుగా భార్యభర్తలు నివసిస్తున్నారు. కాగా శనివారం అర్థరాత్రి దాటాక ఆరుగురు దొంగలు ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి గేటు కొట్టారు. వాచ్ మెన్ ఎవరని అడగ్గా... తాము పోలీసులమని చెప్పారు. వాచ్ మెన్ గేటు తీయగానే అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి, గదిలో పెట్టి గడియ వేశారు.
Samayam Telugu robbers tortured two women to find the cash in house in up
ఆ మూడు గంటలు ఆమెకు నరకం


అనంతరం అక్కడే ఉన్న వాచ్ మెన్ భార్య, అతని 18 ఏళ్ల మేనకోడలిపై రాక్షసత్వాన్ని చూపించారు. వాచ్ మెన్ భార్య (32) చెప్పిన వివరాల ప్రకారం... ఆ దొంగలు రూ.50 లక్షల నగదు ఫామ్ హౌస్ లో ఉందని అదెక్కడుందో చెప్పాలంటూ మహిళలిద్దరినీ వేధించారు. ముఖ్యంగా వాచ్ మెన్ భార్యని చితక్కొట్టారు. ముందుగా కర్రతో, సుత్తిత్తో కొట్టారు.

సిగరెట్లు, అగ్గిపుల్లలతో తొడలపై కాల్చారు. హెయిర్ క్లిప్పుతో చర్మాన్ని గట్టిగా బిగించి పట్టి తీవ్రంగా బాధపెట్టారు. ఆమె ఫామ్ హౌస్ డబ్బులేదని, తమని వదిలేయమని ప్రాధేయపడినా కూడా వారు వినలేదు. దాదాపు మూడు గంటల పాటూ చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులను పట్టుకుని పారిపోయారు.

వాచ్ మెన్ భార్య ఆ కాళరాత్రిని మర్చిపోలేక భయంతో వణికిపోతోంది. ఫామ్ హౌస్ కి వెళ్లకుండా బంధువుల ఇంట్లోనే ఉండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.