యాప్నగరం

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మిస్టర్ వరల్డ్

మిస్టర్ వరల్డ్ - 2016గా గెలిచిన హైదరాబాదీ యూత్ రోహిత్ ఖండేల్ వాల్.

TNN 1 Aug 2016, 12:20 pm
మిస్టర్ వరల్డ్ - 2016గా గెలిచిన హైదరాబాదీ యూత్ రోహిత్ ఖండేల్ వాల్. ఇప్పటిదాకా ఇండియాకు దక్కని కిరీటాన్ని దేశానికి తెచ్చిచ్చిన ఘనత అతనిదే. తన విజయ దేశానికే అంకితమిచ్చాడు రోహిత్. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో సందడి చేశారు.
Samayam Telugu rohit khandelwal at taj falaknuma palace
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మిస్టర్ వరల్డ్


ఎవరైనా ఫలక్ నుమా ప్యాలెస్ దగ్గరికి రాగానే నిజంగా రాజవంశీకులమనే అనుభూతిని పొందేలా అక్కడి సపర్యలు ఉంటాయి. మిస్టర్ వరల్డ్ రోహిత్ కూడా కాసేపు రాజకుమారుడిలా మారిపోయారు. ప్యాలెస్ గేట్ల దగ్గరకి వచ్చిన ఆయన్ని రాచమర్యాదలతో గుర్రపు బగ్గీపై లోపలికి తీసుకెళ్లారు సేవకులు.


కుటుంబసభ్యులతో మిస్టర్ వరల్డ్ ఫ్యామిలీ ఫోటో. తల్లితండ్రులు, అన్నయ్య వదినలతో కలిసి ఫోటో దిగారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలి రోహిత్ మోడల్ గా కెరీర్ ఎంచుకునే విషయంలో అతన్ని అన్న ప్రోత్సాహమే ఎక్కువట.

ఫలక్ నుమా ప్యాలెస్ 101 డైనింగ్ హాల్ లో రోహిత్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పొడవాటి డైనింగ్ హాల్ లో ఒకేసారి 101 మంది కలిసి కూర్చుని భోజనం చేయచ్చు.
ప్యాలెస్ లో సరదాగా బిలియర్డ్స్ ఆడుతున్న మిస్టర్ వరల్డ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.