యాప్నగరం

మద్య నిషేధంతో రసగుల్లా అమ్మకాలు పెరిగాయ్

బిహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చాక రసగుల్లా అమ్మకాలు 16 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్ కుమారే..

TNN 11 Nov 2016, 1:59 pm
బిహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చాక రసగుల్లా అమ్మకాలు 16 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్ కుమారే స్వయంగా వెల్లడించారు. మద్యపాన నిషేధం వల్ల రసగుల్లాలు, పేడా, పన్నీర్, ఖోయా తదితర స్వీట్ల అమ్మకాలు పెరిగాయి. దీన్ని బట్టి ప్రజలు క్రమంగా ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. మద్యనిషేధం కారణంగా బిహార్లో పాల అమ్మకాలు కూడా 11 శాతం పెరిగాయన్నారు. మద్య నిషేధంపై ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన నిశ్చయ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నితీశ్ ఈ విషయాలను తెలిపారు.
Samayam Telugu sale of rasgullas up by 16 since liquor ban bihar cm nitish kumar
మద్య నిషేధంతో రసగుల్లా అమ్మకాలు పెరిగాయ్


వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు, మరుగుదొడ్డి, రోడ్డు సదుపాయం, విద్యుత్‌ను అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సభకు భారీగా మహిళలు తరలివచ్చారు. మద్యంపై నిషేధం విధించడం వల్ల నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో మర్డర్ కేసులు 36 శాతం తగ్గాయని సీఎం సెలవిచ్చారు. గుజరాత్ సహా మిగతా రాష్ట్రాల్లోని నాయకులు కూడా ఇదే తరహాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని నితీశ్ తెలిపారు.

బిహార్లో మద్యపాన నిషేధం ఎంత కఠినంగా అమలవుతోందంటే... ఆయుర్వేద మందుల్లో కలపడం కోసం కూడా అక్కడ ఆల్కహాల్‌ను అనుమతించడం లేదు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పరిస్థితిని కనీసం ఊహించుకోగలమా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.