ఈ సృష్టిలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ ప్రాణికైనా 'అమ్మ' అమ్మే. దేవుడు.. తాను భూలోకంలోనూ ఉండాలని భావించి అమ్మను సృష్టించాడని కొనియాడతారు కొంతమంది తల్లి ప్రేమికులు. అలాంటి అమ్మను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నేటి తరానికి తల్లి విలువను తెలియజెప్పాలనుకున్నారు.. ఓ కళాశాల ప్రధానాచార్యులు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఈ కార్యక్రమానికి వేదికైంది.
ఫిబ్రవరి 9న కళాశాలకు చెందిన 400 మంది విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లులను కాలేజీకి తీసుకొచ్చారు. విద్యార్థులతో వారి తల్లుల కాళ్లు కడిగించి పాదాభివందనం చేయించారు కాలేజీ ప్రిన్సిపాల్ హన్మంతు. ఈ సందర్భంగా తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు.. ఆ తల్లులందరూ. తమ అమ్మకు ఏ కష్టం రాకుండా జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు విద్యార్థులందరూ. భావోద్వేగంతో కొంతమంది తల్లులు కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఎంత కష్టంలో ఉన్నా.. పిల్లల సుఖమే కోరుకునే 'అమ్మ' అంతకంటే ఎక్కువగా ఏం ఆశిస్తుంది మరి!
ఫిబ్రవరి 9న కళాశాలకు చెందిన 400 మంది విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లులను కాలేజీకి తీసుకొచ్చారు. విద్యార్థులతో వారి తల్లుల కాళ్లు కడిగించి పాదాభివందనం చేయించారు కాలేజీ ప్రిన్సిపాల్ హన్మంతు. ఈ సందర్భంగా తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు.. ఆ తల్లులందరూ. తమ అమ్మకు ఏ కష్టం రాకుండా జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు విద్యార్థులందరూ. భావోద్వేగంతో కొంతమంది తల్లులు కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఎంత కష్టంలో ఉన్నా.. పిల్లల సుఖమే కోరుకునే 'అమ్మ' అంతకంటే ఎక్కువగా ఏం ఆశిస్తుంది మరి!